Lokesh: ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున తల సర్వేలు ఏపీలో రాబోయే పార్టీ గురించి వార్తలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా రాగా మరికొన్ని సర్వేలు టిడిపికి అనుకూలంగా వస్తున్నాయి అయితే తాజాగా ఇండియా టుడే సి ఓటర్ సర్వే మరోసారి ఎన్నికల ఫలితాలపై సర్వే చేసి వెల్లడించారు. అయితే ఈ సర్వే టిడిపికి అనుకూలంగా ఉండటం విశేషం.
ఈ సర్వేలో భాగంగా 17 లోక్ సభ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. మిగిలిన 8 స్థానాలకు మాత్రమే వైసిపి పరిమితమవుతుందని వెల్లడించారు. దీంతో ఈ ఫలితాలపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి .
ఇండియా టుడే సర్వే ఫలితాలపై నారా లోకేష్ స్పందిస్తూ వైసిపికి అంతిమయాత్ర మొదలైందని సైకో పోవడం సైకిల్ రావడం పక్కా ఈయన చెప్పుకు వచ్చారు. ఏపీలో 45 శాతం మంది ఓటర్లు టిడిపి జనసేన పార్టీతో కలిసి ఉన్నారని,41 శాతం మంది కేవలం వైసీపీకి పరిమితమై ఎనిమిది లోక్సభ స్థానాలను మాత్రమే గెల పొందబోతున్నారని ఇండియా టుడే సి ఓటర్ సర్వే వెల్లడించారు.