Rashmi: రాముడిని స్మరించండి.. జై శ్రీరామ్.. రష్మీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Rashmi: యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ ఆమెపై ఒక వర్గం వారు తమ ట్రోలింగ్ ద్వారా దాడి చేస్తూనే ఉంటారు. అయితే వాటికిఘాటుగా రిప్లై లు ఇస్తూ రీ ట్వీట్లు చేస్తుంది యాంకర్ రష్మీ. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటానికి రష్మీ ఎప్పుడూ వెనకాడదు. జీవహించకు పూర్తి వ్యతిరేకి రష్మీ ఈమె కనీసం పాలు, పాలపదార్థాలు కూడా ముట్టుకోరు. అలాగే మూగజీవాలను ఇబ్బంది పెడుతున్న వీడియోలను చూసినా, అలాంటి సంఘటన జరిగినట్లు తనకి తెలిసినా సోషల్ మీడియా ద్వారా ఆ సంఘటనలను ఖండించడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. ఇలాంటి విషయాల్లో రష్మీ స్పందన వివాదానికి దారితీస్తుంది.

 

 

తాజాగా రష్మీ మళ్లీ ట్రోలింగ్ కి గురయ్యింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా రష్మీ చేసిన ట్వీట్లు పోస్టులు మీద ట్రోలింగ్ జరుగుతోంది. తనపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్న వారిపై ఘాటుగానే స్పందిస్తుంది రష్మీ. చాలా చాలా ట్వీట్స్ వస్తున్నాయి, చాలా నెగెటివిటీ ఉంది సారీ ఇప్పుడు ఎవరికీ రిప్లై ఇవ్వలేను నేను కాషాయ రంగు చీర కొనేశాను, దీపాలు పెట్టాలి పూజ చేయాలి ఇకపై ఈ దేశంలో ఏడాదికి రెండుసార్లు దీపావళి జరుపుకోవచ్చు. అందరూ దీపాలు వెలిగించండి రామున్ని స్మరించండి జైశ్రీరామ్ హర హర మహాదేవ అంటూ ట్వీట్ చేసింది.

 

 

 

మరి ఈ ట్వీట్ కి ఇంకెన్ని ట్రోలింగ్స్ వస్తాయో చూడాలి. ఇక ప్రస్తుతం రష్మీ కెరియర్ విషయానికి వస్తే ఆమె బుల్లితెరపై షోలు చేస్తూ బిజీ బిజీగా జీవితాన్ని గడుపుతుంది ఆమె ఫోకస్ సినిమాలపై ఎక్కువగా పెట్టినట్లు కనిపించడం లేదు. ఒకటి రెండు సినిమాలలో నటించిన ఆమెకి పేరు తీసుకువచ్చిన సినిమాలు అయితే మాత్రం ఆమె ఖాతాలో పడలేదు. యాంకరింగ్ లో మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది ఈ భామ.

 

 

 

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -