Sania Mirza: షోయభ్ మాలిక్-సానియా మీర్జా విడిపోతున్నారా..? వైరల్ అవుతున్న సానియా పోస్టులు

Sania Mirza: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయభ్ మాలిక్ ల మధ్య పుష్కరకాలంగా సాగుతున్న వివాహ బంధానికి తెరపడనుందా..? ఈ ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సెలబ్రిటీ కపుల్స్ వివాహ బంధం వద్దనుకుని విడాకులు తీసుకుంటున్నట్టుగా ఈ ఇద్దరూ విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది.

 

2009లో తన బాయ్‌ఫ్రెండ్ మహ్మద్ తో ఎంగేజ్‌మెంట్ చేసుకుని తర్వాత విభేదాలతో దానిని క్యాన్సిల్ చేసుకున్న సానియా.. 2010లో పాకిస్తాన్ ఆల్ రౌండర్ షోయభ్ మాలిక్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ 2018లో తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. సానియా కొడుకు పేరు ఇజాన్ మీర్జా. అయితే 12 ఏండ్ల వివాహ బంధానికి సానియా-షోయభ్ గుడ్ బై చెబుతున్నారని సమాచారం.

 

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సానియా మీర్జా.. ‘పగిలిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి..’ అని పోస్ట్ పెట్టడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. పలు పాకిస్తాన్, భారత్ కు చెందిన ఛానెళ్లు కూడా ఇదే విషయాన్ని ఎత్తిచూపుతూ సానియా-షోయభ్ లు విడిపోవడానికే నిశ్చయించుకున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 

అయితే దీనిపై అటు సానియా గానీ ఇటు మాలిక్ గానీ అధికారిక ప్రకటన వెలువరించలేదు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత 2020లో మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టిన ఈ హైదరాబాదీ.. టోక్యో ఒలింపిక్స్ తో పాటు ఇతర టోర్నీలలో ఆడినా పెద్దగా రాణించలేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ముగిశాక ఆమె.. ఇక తాను రిటైర్ అయ్యే సమయం వచ్చేసిందని సోషల్ మీడియాలో చేసిన పోస్టు పలు అనుమానాలకు తావిచ్చింది. ప్రస్తుతం యూఏఈలో ఉంటున్న సానియా.. తన విడాకుల పుకార్లపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..


 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -