Viral: పదో తరగతి విద్యార్థితో లేచిపోయిన టీచర్.. చివరకు?

Viral: ఉపాధ్యాయులు అంటే విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పాల్సినవారు. విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి చదువు చెప్పి మంచి నడవడిక,క్రమశిక్షణ నేర్పించాల్సిన వారు. కానీ ఈ మధ్యకాలంలో చాలా వరకు చాలామంది ఉపాధ్యాయులు దారుణంగా సభ్య సమాజం తల దించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక టీచర్ విద్యార్థినికి లవ్ లెటర్ రాసిన విషయం తెలిసిందే. ఇక కాకుండా ఇంకో ప్రదేశంలో ఉపాధ్యాయుడు విద్యార్థులు నేర్పించాల్సింది పోయి ఆడపిల్లలను లైంగికంగా వేధించాడు.

తాజాగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థినితో కలిసి జంప్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే. ఈ ఘటన చందానగర్‌ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. గత నెల ఫిబ్రవరి 17వ తేదీన ఒంట్లో బాగులేదని చెప్పి స్కూల్‌ నుంచి వెళ్ళిన టీచ‌ర్ ఇంటికి వెళ్ళకుండా అదే స్కూల్‌లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థితో కలిసి వెళ్లిపోయింది. తమ కుమారుడు కనిపించడం లేదంటూ విద్యార్థి తల్లిదండ్రులు, తమ కూతురు కనిపించడం లేదంటూ అటు టీచర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

అయితే 10 రోజుల త‌ర్వాత విద్యార్థి, టీచ‌ర్లు ఎవ‌రి ఇంటి వారు చేరుకోవ‌డంతో వారి త‌ల్లిదండ్రులు కేసు వెన‌క్కి తీసుకున్నారు. ఇన్ని రోజులు ఎక్క‌డికెళ్లావంటు బాలుడిని ప్ర‌శ్నించ‌డంతో ఇరువురు మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఇద్ద‌రిని పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -