Rangareddy: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఆత్మహత్యల కేసులు కలకలం రేపుతున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది చిన్న చిన్న విషయాలకే ఊహించిన విధంగా నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చదువుకున్న వారే ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆశ్చర్య పోవాల్సిన విషయం. రెప్పపాటు కాలంలో ఊహించని నిర్ణయాలు తీసుకుని జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు తల్లిదండ్రులకు తీరని శోఖాన్ని మిగులుస్తున్నారు. తాజాగా కూడా ఒక మహిళ కానిస్టేబుల్ అలాంటి పని చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే…రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం, జైత్వారం గ్రామానికి చెందిన పర్వతాలు కుమార్తె డి.సురేఖ 28 ఏళ్ల యువతి ఛత్రినాక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. అలియాబాద్ కాల్వగడ్డ ఏడు గుళ్ల ప్రాంతంలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉంటోంది. 2018 బ్యాచ్కు చెందిన సురేఖ డబ్ల్యూపీసీ 30259 ఇటీవల భవానీనగర్ పోలీసు స్టేషన్కు బదిలీ అయినప్పటికీ ఇంకా ఇక్కడి నుంచి రిలీవ్ కాలేదు. గతా ఏడాది సురేఖకు పెళ్లి సంబంధం కుదిరి కొన్ని కారణాల వల్ల రద్దయింది. తాజాగా ఈనెల 1న స్వగ్రామానికి చెందిన ఒక యువకుడితో సురేఖకు నిశ్చితార్థం జరిగింది.
అయితే, నిశ్చితార్థం జరిగాక పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి వరుసకు కొడుకు అవుతాడని, జాతకాలు కూడా కుదరడం లేదని ఇరుకుటుంబాలు చర్చించుకుంటుండడంతో ఈ సంబంధం కూడా రద్దయి తనకు ఇంకా పెళ్లి జరగదేమో అని మనస్తాపానికి గురైంది. తాజాగా మే 2న సురేఖ సోదరి ఉద్యోగానికి వెళ్లి 3న ఉదయం 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానికులు తలుపులు బద్దలుకొట్టి చూడగా సురేఖ సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. సురేఖను ఆ విధంగా చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.