Pastor: బాలికపై అత్యాచారం చేసిన పాస్టర్.. పుట్టిన బిడ్డని?

Pastor: ఇటీవల కాలంలో చాలా మంది పవిత్రమైన దేవాలయాలలో మత పెద్దలుగా కొనసాగుతూనే ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా కొంతమంది వర్తిస్తున్నారు. మత పెద్దలుగా కొనసాగుతూ అలాంటి పనులు చేయడంతో మతం పేరుతో తప్పుడు పనులు చేస్తున్నారు అంటూ మతాన్ని సంబోధించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా ఒక పాస్టర్ చర్చికి వచ్చిన బాలికకు అన్యాయం చేయడం మాత్రమే కాకుండా విషయం వెలుగులోకి లేకుండా జాగ్రత్త పడినప్పటికీ బంధువులు నిలదీయగా అసలు విషయం మొత్తం బయటపడింది. అసలేం జరిగిందంటే..

కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో పుల్లేటికుర్రు శివారు చీకురు మిల్లి వారి పేటలో పాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు బెజవాడ హోసన్న అలియాస్ సుబ్రమణ్యం. ఒక చర్చిని ఏర్పాటు చేసి మత బోధనలు చేస్తున్నారు. అయితే ఆ చర్చిలో సభ్యురాలిగా 17 ఏళ్ల బాలిక కూడా ఉంది. కానీ ఆ బాలికకు తల్లి లేదు. చర్చికి వచ్చే సమయంలో ఆ బాలికను మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు పాస్టర్. అనేకసార్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై గర్భవతిని కూడా చేశాడు. నెలలు నిండిన ఆమెను కొంతమంది సహాయంతో ఆసుపత్రిలో చేర్పించాడు. గత నెలలో బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది.

కానీ తన నిజ స్వరూపం ఎక్కడ బయటపడుతుందో అని పుట్టిన వెంటనే బిడ్డను మాయం చేశాడు పాస్టర్. అయితే బాలిక కనిపించకపోయేసరికి బంధువులు బాలిక ఎక్కడ ఉందని పాస్టర్‌ను నిలదీయగా బాలిక కడుపులో కణితి ఉందని నమ్మించాడు. కొద్దీ రోజులకి చికిత్స అనంతరం బాలిక ఇంటికి చేరుకుంది. వెంటనే బంధువులు బాలికను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పుట్టిన బిడ్డను కూడా పాస్టర్ మాయం చేశాడని లేదంటే చంపేసి ఉంటారు లేకపోతే అమ్మేసి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. వెంటనే బంధువులు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు సమాచారం అందించగా స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త, మహిళా పోలీస్‌, చైల్డ్‌ప్రొటక్షన్‌ అధికారులు బాలిక ఇంటికి వెళ్లి సమాచారాన్ని తెలుసుకున్నారు. బాలికకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు. పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, పుట్టిన బిడ్డ ఏమయ్యాడో దర్యాప్తు చేయాలని బాలిక బంధువులు కోరుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -