Pawan: ఏపీలో జనసేన రియాలిటీ ఇదే.. మార్పు రావాలంటే పవన్ రావాల్సిందే!

Pawan: వైయస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని చూసి భయపడుతున్నారా అందుకే పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వచ్చారా.. పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడటానికి ఆయనలో పవన్ కళ్యాణ్ పుట్టించిన భయమే కారణమని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏ సభకు వెళ్లిన ఆయనవైవాహిక జీవితం గురించి అలాగే దత్తపుత్రుడు ప్యాకేజి స్టార్ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

 

ఇలా టిడిపిని కాకుండా జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడానికి కారణం లేకపోలేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బ్రతికి ఉంది అంటే కేవలం జనసేన కారణంగానే అని చెప్పకనే చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జరగబోయే ఎన్నికలలో జనసేన టిడిపి కూటమిగా కలిసి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీలు కలిస్తే వైసిపి అధికారం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలవకుండా ఉండడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తూ ఆయనపై తరచూ విమర్శలు కురిపిస్తున్నారు .అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉడకలేదని చెప్పాలి. ఇలా జనసేన టిడిపి పొత్తు పెట్టుకోవడంతో వచ్చే ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పోవడం తప్పదని ఆయనలో ఏదో తెలియని భయం మొదలయ్యే ఇలా మాట్లాడుతున్నారని పలు సర్వేలు తెలుపుతున్నాయి.

 

సాక్షాత్తు నేషనల్ మీడియాలో కూడా జనసేన పార్టీ కారణంగానే టిడిపి పార్టీ ఇంకా ఉందని చెబుతున్నాయి. ఈ ఒక్క మాటే జగన్మోహన్ రెడ్డిలో భయం పుట్టిస్తుందని చెప్పాలి. ఇక వచ్చే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా మార్పులు రావాలి అంటే జనసేన రావాల్సిందేనని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలలో జనసేన పార్టీకి భారీ స్థాయిలో మద్దతు ఉంది ఇక టిడిపితో పొత్తు కుదరడంతో ఇక ఈ పార్టీకి తిరుగు లేదని వచ్చే ఎన్నికలలో విజయకేతనం ఎగరవేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -