Crime News: భార్య భర్తలన్నాక ఎన్నో గొడవలు మనస్పార్థలు, వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత మళ్లీ ఒకరికొరు కలిసి పోతారు. కొందరు గొడవలు జరిగినప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయినా తమ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి తమ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటారు. మరి కొందరు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంతో పిల్లలు అనాథలై రోడ్డున పడుతున్నారు.
ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని తుక్కుగూడలో చోటు చేసుకుంది. తుక్కుగూడలో నివాసముంటున్న సాయి కార్తీక్గౌడ్(33) రవళి దంపతులు ఈ నెల 12న భార్య బంధువలు ఇంట్లో జరిగిన వివాహానికి హాజరయ్యారు. భార్యను అక్కడే వదిన సాయి కార్తీక్ మరోసటి రోజు ఒక్కడే ఇంటికొచ్చాడు. సాయి కార్తీక్ పిన్ని ఇంట్లో బోనాల పండగ నిర్వహిస్తుంనందుకు భార్యకు ఫోన్చేసి రావాలని కోరారు. రవళికి పలుమార్లు ఫోన్చేసినా తాను రానని నువొక్కడివే వెళ్లాలని సూచించింది. మళ్లీ ఫోన్చేసి కచ్చితంగా రావాలని కోరగా ఆమె ససేమీర అనడంతో కార్తీక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఆ తర్వాత రోజు మరోసారి ఫోన్చేసి మీ బంధువుల ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నా.. నువ్వు మాత్రం మా బంధువుల ఫంక్షన్లకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించాడు. మరోసారి కార్తీక్ ఫోన్చేసి రావాలని కోరగా రవళి రానని తెగేసి చెప్పింది. ఆ తర్వాత భార్యకు వీడియోకాల్ చేస్తూ మాట్లాడుతూనే దూలానికి ఉరేసుకున్నాడు. అది చూసిన రవళి ఒక్కసారిగా ఖంగుతిని చుట్టుపక్కల వాళ్లకు ఫోన్చేసి తన భర్త ఆత్మహత్య చేసుకుంటున్నాడని కాపాడాలని వేడుకొంది. ఆమె వెంటనే తుక్కుగూడకు బయలుదేరింది. రవళి వచ్చే వరకు కార్తీక్ చనువు చాలించాడు. భార్య భర్తల గొడవలు సాధారణంగా ఉండాలని క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోరాదని నిపుణులు సూచిస్తున్నారు.