నయనతార దక్షిణ భారతీయ చలనచిత్ర నటి. మొదట మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించి మలయాళం లో మనస్సినక్కరే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందింది.
తర్వాత తమిళంలో నటించిన చంద్రముఖి సినిమా తెలుగులో డబ్ చేయబడింది. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు పొంది తర్వాత లక్ష్మి, బాస్ చిత్రాలలో నటించి తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ఇక వరుస అవకాశాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో రాణించి అగ్ర తారలలో తాను కూడా ఒక స్థానం సంపాదించుకుంది.
ఇటీవలే నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం రీసెంట్గా నయనతార, విఘ్నేష్ పెళ్లి డాకుమెంట్రీ కి సంబంధించిన ప్రోమో పార్ట్ వన్ రిలీజ్ అవ్వడమే.
అయితే కొందరు ప్రపంచంలో మీరే పెళ్లి చేసుకున్నారా..? మిగతా ఎవరు పెళ్లి చేసుకోలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పెళ్లి డాక్యుమెంటరీని డైరెక్టర్ గౌతమ్ మీనన్ తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని రీసెంట్గా నెట్ ఫిక్స్ లో రిలీజ్ చేసింది.
తమపై వచ్చే కామెంట్స్ కు నయనతార తనకు కూడా అందరూ ఆడపిల్లల వలె పెళ్లి పట్ల కొన్ని ఫీలింగ్స్ ఉంటాయని తెలపడం జరిగింది. ఇక దీనిపై విఘ్నేష్ మాట్లాడుతూ నయనతార అందరికీ ఒక హీరోయిన్ గానే తెలుసు తాను పర్సనల్ గా ఎలా ఉంటుందో కేవలం నాకు మాత్రమే తెలుసు అని చెప్పాడు.
ఇంకా తన కోసం ఎన్నో వదులుకుందని, తనకు నచ్చే విధంగా ఉండడం కోసం ఇష్టమైనవి వదులుకొని, నాతో సంతోషంగా ఉందని చెబుతూ, ఇలాంటి భార్య దొరకడం తన అదృష్టం అని పేర్కొనడం జరిగింది. ఇక రెండుసార్లు హనీమూన్ కంప్లీట్ చేసుకున్న ఈ జంట ముచ్చటగా మూడోసారి కూడా హనీమూన్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.