AP Polls: వాలంటీర్లకు తాయిలాలు ఇస్తున్న జోగి.. హాట్ బాక్స్ లు, ప్లాస్క్ సెట్ లను పంపిణీ చేస్తూ?

AP Polls: మరొక నెలన్నర వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల తాయిలాలు ప్రజల వద్దకు వెళ్తున్నాయని తెలుస్తుంది ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఇప్పటికే తమకే ఓటు వేయాలి అంటూ పెద్ద ఎత్తున ప్రజలకు వివిధ రకాల వస్తు రూపంలో లంచాలను అందిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ భారీ స్థాయిలో నియోజకవర్గ ప్రజలకు కుక్కర్లు ప్లాస్కులు పంపిణీ చేస్తున్నారు.

గత కొద్ది రోజుల క్రితం పాస్టర్లతో మీటింగ్ నిర్వహించినటువంటి జోగి రమేష్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనని గెలిపించాలని తెలియజేశారు. ఇలా ఈ మీటింగ్ అనంతరం ఒక్కొక్కరికి 2000 రూపాయలు చొప్పున నగదు ఇవ్వడమే కాకుండా కుక్కర్లు, ఫ్లాస్కులను కూడా అందజేస్తూ ఓటు వేయాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ విషయం ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ కూడా వైకాపా నేతలు ఏ మాత్రం వారి తీరు మార్చుకోలేకపోతున్నారు.

తాజాగా మరోసారి వాలంటీర్ల చేత ఈ విధమైనటువంటి తాయిలాలను ప్రతి ఒక్క ఇంటికి చేరవేస్తున్నారు. ఇక తాజాగా వాలంటీర్ల చేత వైఎస్ఆర్సిపి గుర్తులు జోగి రమేష్ ఉన్నటువంటి ముఖచిత్రం ఉన్నటువంటి బ్యాగ్ లో హాట్ బాక్సులు ఫ్లాస్కులను పెట్టి ఇంటింటికి పంపిస్తున్నారు. ఇక ఈ బాక్స్ లపై ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఆశీర్వదించండి అని కూడా రాసి ఉంది.

ఇలా రాష్ట్రంలో పలు నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున వాలంటీర్లకు సభ ఏర్పాటు చేసి వారిని సత్కరించడమే కాకుండా వాళ్లకు పెద్ద ఎత్తున చికెన్ బిర్యానీలను పెడుతూ భారీ స్థాయిలో కానుకలను కూడా అందిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఇలా కానుకలను అందిస్తూ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -