Lord Ganesha: ఈ 5 మంత్రాలను చదువుతూ వినాయకుడిని పూజిస్తే సిరి సంపదలు.. ఆ సమస్యలన్నీ పోతాయా?

Lord Ganesha: ఎప్పుడు సమస్యలతో సతమతమైపోయే మనుషులని విఘ్నాలను తొలగించే వినాయకుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. అయితే కష్టాల కొలిమిలో మనమే ఆయన ఉనికిని గ్రహించలేక పోతాం. ఏదైనా సమస్య వచ్చిందంటే విఘ్నాలను తొలగించే దేవుడు కాబట్టి వినాయకుడిని ముందుగా తలచుకుంటా కష్టాలని తీర్చమంటూ వేడుకుంటాం.

అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా మన పనులు పూర్తయిపోవాలంటే వినాయకుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు చదవడం వలన ఫలితాలు త్వరగా వస్తాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆ మంత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఓం గం గణపతయే నమః హ అని వినాయకుడిని పూజిస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఏదో తెలియని నూతన ఉత్సాహం, ధైర్యం వస్తాయి. అలాగే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా..

ఈ మంత్రం పఠించడం వలన ఏమైనా పనులకి ఆటంకం ఉంటే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. మనం చేయాలనుకునే పనికి దారి సులభతరమౌతుంది. అలాగే ఓం ఏకదంతాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి, తన్నో దంతి ప్రచోదయాత్. ఈ మంత్రం చదవటం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి త్వరలోనే ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే ఓం వికటాయ నమః అనే మంత్రాన్ని చదవటం వలన కష్టాలు తొలగిపోయి ఆనందంగా ఉండవచ్చు. అలాగే దారిద్యం కూడా వదిలిపోతుంది.

ఓం హ్రీన్గ్ గ్రీన్గ్ హ్రీన్గ్ అనే మంత్రాన్ని చదవటం వల్ల నిస్తేజం వదిలి ఎప్పుడూ ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే వినాయకుడు పూజ చేసుకోవడం వలన ఎక్కడలేని ప్రశాంతత మనసుకి లభిస్తుంది. అలాగే ఏ పూజ ప్రారంభించినా ముందుగా శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోప శాంతయే అనే మంత్రాన్ని చదవటం మనకి తరతరాల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి వినాయకుడిని పూజిస్తూ ఈ మంత్రాలని పఠించి శాంతి సౌభాగ్యాలని, సుఖ సంతోషాలని పొందండి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -