Anchor Lasya: లాస్య ఎమోషనల్ పోస్ట్ వైరల్.. అలా కామెంట్స్ చేయడంతో?

Anchor Lasya: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి యాంకర్ లాస్య గురించి అందరికి పరిచయమే. ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ గా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది లాస్య. కానీ గతంలోనే లాస్య యాంకర్ గా బాధ్యతలను ముగించుకుంది. అప్పట్లో యాంకర్ రవి తో కలిసి కొన్ని షో లలో చేసి బాగా సందడి చేసింది. కేవలం బుల్లితెరపై షో లలోనే కాకుండా ఎం యల్ ఏ, రాజ మీరు కేక, స్వాతి ఐ లవ్ యు వంటి చిత్రాలలో వెండి తెరపై నటించి తనదైన నటనను కనబరిచింది.

 

ఇక అప్పట్లో రవితో రిలేషన్ లో ఉన్నట్టు బాగా వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లే అని తర్వాత కు తెలిసాయి. పైగా లాస్య యాంకర్ గా దూరం కావడానికి కారణం యాంకర్ రవి అని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత నిజం ఉందో ఎవరికి తెలియదు. ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉండి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మంజునాథ్ చిల్లాలేను పెళ్ళి చేసుకుంది. ఇక ఈమెకు ఇద్దరు కొడుకులు. ఇటీవలే రెండో కొడుకుకి జన్మనిచ్చింది.

పెళ్లి తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. ఇక సోషల్ మీడియా ద్వారా మరోసారి తన అభిమానులకు దగ్గర మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్బాస్ 4 సీజన్ లో కూడా అవకాశం అందుకుంది. హౌస్ లో ఉన్నంతకాలం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది లాస్య. ఇక సోషల్ మీడియాలో తన భర్తతో చేసే ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.

 

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. నిన్న భర్త పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్ట్ షేర్ చేసుకుంది. హ్యాపీ బర్త్డే మంజునాథ్.. నువ్వు నన్ను నవ్వించావు.. నా కళ్ళు తుడిచావు.. గట్టిగా హత్తుకున్నావు.. నా సక్సెస్ చూసావు. నా వైఫల్యాలను చూసావు. ఎలాంటి సమయంలోనైనా నా పక్కనే నిలిచి ధైర్యాన్ని ఇచ్చావు.. నా పిచ్చిని భరించే ఏకైక వ్యక్తివి నువ్వే అంటూ.. పర్ఫెక్ట్ హస్బెండ్ కు భార్యగా గర్వపడుతున్నాను అంటూ ఎమోషనల్ గా పంచుకుంది.

Related Articles

ట్రేండింగ్

Asaduddin Owaisi-PM Modi: ముస్లింలే ఎక్కువ కండోమ్స్ వాడుతున్నారు.. వైరల్ అవుతున్న అసరుద్దీన్ ఒవైసీ కౌంటర్!

Asaduddin Owaisi-PM Modi:  మొదటి దశ ఎన్నికల పోలింగ్ తరువాత రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ క్రమంలో ఆయన ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా...
- Advertisement -
- Advertisement -