Adireddy: ఆదిరెడ్డి తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణాలివేనా?

Adireddy: బెంగళూరులో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే ఆదిరెడ్డి ఇప్పుడు యూట్యూబర్ గా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, బిగ్ బాస్ రివ్యూవర్ గా చాలా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ రివ్యూవర్ గా చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ షో ఆరో సీజన్లో కామనర్ కోటాలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది రెడ్డి  ఆరంభంలోనే అతని ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అయ్యాడు తద్వారా అందరు దృష్టిలోని పడ్డాడు. ఇప్పుడు అతని సంపాదన లక్షలలో ఉండటం గమనార్హం.
అయితే ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన తల్లిని గురించి చెల్లిని గురించి మాట్లాడుతూ. ఒకప్పుడు ఆర్థికంగా చాలా వెనకబడి ఉండేవాళ్ళని అమ్మ ఒంటిమీద ఒక్క నగ కూడా ఉండేది కాదు. ఏమైనా ఫంక్షన్ కి వెళ్లాలంటే పక్క వాళ్ళు నగలు వేసుకొని వెళ్ళేది. ఆర్థిక ఇబ్బందులతో ఆమె 2013లో ఆత్మహత్య చేసుకుంది.  ఇప్పుడు ఉండి ఉంటే ఆమెకి ఒంటినిండా నగలు చేయించేవాడిని అని చెప్తూ ఆదిరెడ్డి చాలా ఎమోషనల్ అయ్యాడు.
అలాగే చెల్లి నాగలక్ష్మి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఇప్పుడు నా దగ్గర లక్షల డబ్బు ఉంది. అయినప్పటికీ తనకి పెళ్లి చేయను ఎందుకంటే ఆమెకి కంటిచూపు సరిగ్గా లేదు ఒక కంటితోఐదు శాతం మాత్రమే చూడగలుగుతుంది. ఈ వైకల్యంతో ఆమె అత్తవారింట్లో నెట్టుకు రాలేదు ఇప్పుడు ఆమె బాగోగులు నా భార్య చూస్తుంది. ఆమెకి ఆపరేషన్ చేయించినా కూడా చూపు రాదని డాక్టర్లు చెప్పారు అందుకే ఆమెకి పెళ్లి చేయడం లేదు అని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.
తల్లి చనిపోయినప్పుడు తనని అందరూ జాలిగా చూసేవారని, అప్పట్లో కేవలం చెల్లి పెన్షన్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళమని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. అయితే ఇప్పుడు లక్షలలో ప్రార్థిస్తూ నా కోసం బాధపడేవాళ్లు గర్వపడేలాగా బ్రతుకుతున్నాను అని చెప్పుకొచ్చాడు. ఈ మధ్యనే విజయవాడలో ఒక లగ్జరీ బ్యూటీ సెలూన్ కూడా ఓపెన్ చేశాడు. నిజంగా అతని జర్నీ
చాలా స్ఫూర్తిదాయకం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -