Ambati Rambabu: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసిపి నాయకులకు ప్రచారాల పిచ్చి భారీగా ఉందనే సంగతి మనకు తెలిసిందే. అభివృద్ధి లేకపోయినా ప్రచారం మాత్రం పీక్స్ లో ఉంటుంది. చేసింది గోరంత అయితే చెప్పుకునేది కొండంత అని చెప్పాలి అయితే ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు ప్రచార కార్యక్రమాలను చేయాలన్న ఉద్దేశంతో చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ విమర్శలకు గురి అవుతున్నారు.
ముఖ్యంగా వైసిపి మంత్రి అంబంటి రాంబాబు తన నియోజకవర్గ పరిధిలో ప్రచార కార్యక్రమాలను విభిన్న రీతిలో ప్రారంభించారు. టీ కప్పు పై తన బొమ్మతో పాటు వైయస్ జగన్ బొమ్మ ఉన్నటువంటి కప్పులను ప్రతి ఒక్క టీ కొట్టుకు పంపించారు వాళ్లు కూడా కప్పులు ఫ్రీగా రావడంతో తీసుకున్నారు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆ టీ కప్స్ లోనే టీ తాగాలంటూ ఆదేశించారు.
ఇలా టీ తాగి అందరూ కూడా ఆ టీ కప్పులను చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. ఈ చెత్త కుప్పలలో టీ కప్పులో ఉండడంతో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ఎన్నికలకు ముందుగానే వారు చేరాల్సిన చోటకు చేరుకున్నారు అంటూ పలువురు ఈ సంఘటనపై విమర్శలు చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారాలు భిన్నంగా ఉంటాయని ఆలోచించిన అంబంటికి ఇది ఊహించని దెబ్బ అని చెప్పాలి ఇలా చెత్త కుప్పల్లో పడేసినటువంటి ఈ టీ కప్పులపై మనుషులు జంతువులు చేయకూడని రోత మొత్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రచార కార్యక్రమాలను విభిన్నంగా చేయాలని ఆలోచించిన అంబటి ఆలోచన మాత్రం బెడిసి కొట్టిందని చెప్పాలి.
పైగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇలా ఫోటోలు ఉన్నటువంటి టీ కప్పులను సరఫరా చేయడం అనేది ఎన్నికల నియమావళిని ఉల్లంగించిన నేపథ్యంలో టిడిపి నేతలు ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమయ్యారు మొత్తానికి ఏదో అనుకుంటే మరేదో అయింది అనేలా అంబటి పరిస్థితి ఉందని చెప్పాలి.