Ys Jagan- Ys Bharathi: ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా క్లాస్ గా మాట్లాడేవారు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో అయినా లేదంటే ఏదైనా సభలు సమావేశాలలో అయినా కూడా ఒక సీఎం హోదాలో ఉండి ఎంతో క్లాస్ గా మాట్లాడేవారు అయితే ఈ మాటలు మాస్ జనాలకు పెద్దగా తొందరగా అర్థం కాకపోయేదని చెప్పాలి. ప్రస్తుతం మాత్రం చంద్రబాబు నాయుడు పూర్తిగా మాస్ అయ్యారనే చెప్పాలి.
ఈయన గత కొద్దిరోజులుగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పట్ల భారీ స్థాయిలో మాస్ ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ చంద్రబాబు నాయుడు జగన్ ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు పసుపు రంగు చీర గురించి కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా పసుపు పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు వద్దకు షర్మిల తన కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్లారు. అయితే ఇదే విషయం గురించి జగన్ మాట్లాడుతూ పసుపు చీర కట్టుకొని శత్రువుల వద్దకు వెళ్లి మోకరిల్లారు అంటూ జగన్ మాట్లాడారు ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తి నెలకొనడమే కాకుండా ఆయన పట్ల ఎన్నో విమర్శలు వచ్చాయి.
ఇక చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయం గురించి జగన్ పై భారీగా విమర్శలు చేశారు. తన చెల్లెలు పసుపు రంగు చీర కట్టుకుంటే తప్పు అదే తన భార్య భారతి పసుపుపచ్చ డ్రస్సు వేసుకొని ఆయన పక్కన నిలబడితే ఇప్పుడు జగన్ ఏం చేస్తారు? ఆయన భార్యకు విడాకులు ఇస్తారా అంటూ ఓ రేంజ్ లో జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.