Ambati Rambabu: సంబంధం లేని సమాధానం ఇచ్చి అభాసుపాలైన అంబటి.. పరువు పోయిందిగా!

Ambati Rambabu: మీడియాకి అడ్డంగా దొరికిపోవడం, దొరికిపోయాను అనుకున్నప్పుడు మీడియాపై విరుచుకుపడటం అంబటి రాంబాబుకి అలవాటైన పనే. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులలో ఒకరైన అంబటి రాంబాబు మీద వివాదాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆయన సోషల్ మీడియాలో కనిపించారు అంటేనే ఏదో ఒక వివాదాస్పద వ్యవహారం జరిగి ఉంటుందని అర్థం. అలాగే ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు అంబటి రాంబాబు. అడ్డదిడ్డంగా మాట్లాడి మీడియాకి అడ్డంగా దొరికిపోయారు.

ఇంతకీ ఏం జరిగిందంటే జగన్ మీద రాళ్ల దాడి జరిగినప్పుడు ప్రతిపక్షాలను దారుణంగా విమర్శించారు. అయితే ఇటీవల ఒక టీవీ ఛానల్ నిర్వహించిన మీడియా చర్చా గోష్టి పాల్గొన్న అంబటి రాంబాబుని ఇదే విషయం గురించి విలేకరులు ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు మీద రాళ్లదాడులు జరిగినప్పుడు మీరు దీనికి భిన్నంగా మాట్లాడారు కదా, రాళ్లు దాడి చేసినా తప్పు లేదని మాట్లాడారు కదా అని అడగటంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు అంబటి.

ఆ తర్వాత అసలు ఆ సంఘటనపై నేనేమీ స్పందించలేదంటూ అబద్ధం చెప్పారు. అయితే సదరు విలేకరి వెంటనే తన మొబైల్ తీసి వైరల్ అయిన అంబటి రాంబాబు పాత వీడియోని చూపించారు. ఆ వీడియోలో చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ ఎవరో అసంతృప్తిలో ఒక రాయి విసిరితే దానిమీద అంతరార్థం చేయాలా అంటూ దబాయించటం కనిపించింది. వీడియో చూసిన రాంబాబు ఇది గతంలో తాను మాట్లాడినదని, ఇప్పుడు చంద్రబాబు మీద జరిగిన రాళ్లదారి గురించి అడిగారేమో అనుకొని అలా అన్నానని చెప్పుకొచ్చారు.

బాబు అంటేనే డ్రామాలు చేసేవాడు, ఆయన గురించి అప్పుడు ఇప్పుడు అదే మాట్లాడుతానని సంబంధంలేని సమాధానం ఇచ్చి మీడియాకి అడ్డంగా దొరికిపోయారు. గతంలో కూడా అంబటి ఒక ప్రెస్ మీట్ లో విలేకరి తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధించిన కీలకమైన ప్రశ్నను అడిగితే సమాధానం చెప్పకుండా అతనిని బయటికి నడవమనటం కూడా మనందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -