Bengaluru: నగ్న ఫొటోలు లీక్‌ చేయడంతో డాక్టర్‌ ప్రియుడిని లేపిసిన ప్రియురాలు?

Bengaluru: భార్యభర్తలు, లవర్స్‌ మధ్య తలెత్తే చిన్న చిన్న వివాదాలతో ఒకరికొకరూ కొట్టుకుని కాసేటికి ఒకటవుతారు. కానీ.. ఈ ఘటనలో తన ప్రియుడు చేసిన ఓ తప్పుకు ఏకంగా అతడి ప్రాణాలనే తీసింది ఓ ప్రియురాలు. ప్రియుడు తన ప్రైవేటు ఫొటోలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేశాడనే కోపంతో మరో ముగురు స్నేహితులకు కలిసి అతడిని అంతమొందించిన ఘటన బెంగళూరు బేగూరు పరిధిలో చోటుచేసుకుంది.

స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితురాలు ప్రతిభ (26), ఆమె స్నేహితులు సుశీల్, గౌతమ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నె నగరానికి చెందిన వికాస్‌ (27), ప్రతిభ లవర్స్‌. ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ పూర్తి చేసి వచ్చిన వికాస్‌ చెన్నెలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వచ్చిన వికాస్‌ మైకో లే అవుట్‌ వద్ద నివసిస్తున్నాడు. బెంగళూరు హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో ఓ ఆర్కిటెక్ట్‌ కంపెనీలో పని చేస్తున్న ప్రతిభ వికాస్‌కు రెండేళ్ల క్రితం సోషల్‌ మీడియాలో ఒకరికొకరు పరిచయమయ్యారు.

వికాస్‌ బెంగళూరుకు వచ్చాక అది ప్రేమగా మారింది. కొన్ని రోజులు ఇరువురు సినిమాలు, షికార్లంటూ బాగా ఎంజాయ్‌ చేశారు. ఆ తర్వాత వీరి ప్రేమ విషయాన్ని ఇద్దరు ఇంట్లో చెప్పగా ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి ప్రేమను ఒప్పుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో నవంబర్‌ నెలలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రతిభ నగ్న ఫొటోలను వికాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పోస్ట్‌ చేశాడు. రెండు, మూడు రోజుల తర్వాత ఆ ఫొటోలను ప్రతిభ కూడా చూసింది. దీంతో ప్రతిభ కుటుంబీకులు వికాస్‌తో గొడవకు దిగారు.

అయితే ప్రేమించిన వాడు మోసం చేశాడని, కుటుంబం ముందు పరువు తీశాడని ప్రతిభ కుమిలిపోయింది. ఆఫీసులో స్నేహితులైన సుశీల్, గౌతమ్, సూర్యతో ప్రతిభ తనతో జరిగిన విషయాన్ని చెప్పింది. అతనికి బుద్ధి చెప్పాలని అందరు కలిసి వారం రోజుల క్రితం వికాస్‌ గదికి వెళ్లి తీవ్రంగా కొట్టి వారే ఆస్పత్రికి తీసుకెళ్లి ఎవరో కొట్టి పారిపోయారని చెప్పారు. అక్కడ చేర్చుకో కపోవడంతో సెయింట్‌ జాన్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న బాధితులు ఆదివారం రాత్రి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రతిభతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -