Bengaluru: భార్య కోసం దారి కాచి మరి దాడి చేసిన భర్త?

Bengaluru: భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. కొన్నిసార్లు ఆ చిన్న చిన్న గొడవలే చిలికి చిలికి గాలి వానగా కూడా మారుతూ ఉంటాయి. అయితే కొన్ని సార్లు విడాకుల వరకు వెళితే మరి కొన్నిసార్లు చంపుకోవడం వరకు వెళుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. భర్తను విడిచి దూరంగా ఉంటున్న భార్యపై పెంచుకున్నాడు ఒక భర్త. అంతటితో ఆగని ఆ దుర్మార్గుడు ఆమెపై దాడికి ప్రయత్నించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

కర్ణాటక, బెంగళూరు జిల్లా, దేవనహళ్లి తాలూకా లోని గొబ్బెరగుంట గ్రామానికి చెందిన చంద్రకళ, ముని కృష్ణప్ప భార్యభర్తలు. వీరికి పెళ్లయి 20 సంవత్సరాలు అయింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, భార్య భర్తలిద్దరూ తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే భర్త ప్రవర్తన కారణంగా చంద్రకళ విసిగిపోయింది. భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తోంది. తన కూతురుతో కలిసి అక్కడికి దగ్గరలోని ఓ గార్మెంట్‌ కంపెనీలో పనికి వెళ్తూ ఉండేది. కాగా తాజాగా చంద్రకళ ఎప్పటిలాగే సాయంత్రం పని ముగించుకొని ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చింది.

చంద్రకళ కోసం కాపు కాసిన భర్త మునికృష్ణప్ప తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె రెండు చేతుల్ని నరికేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు గట్టిగా అరవటంతో వెంటనే ముని అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ చంద్రకళను బెంగళూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమె రెండు చేతులకు వైద్యం అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ముని కోసం అన్వేషిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -