Biryani: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా రోడ్ సైడ్ కర్రీ పాయింట్ లు, హోటల్స్ ఎక్కువ అయిపోయాయి. చాలామంది తక్కువ ధరకే హోటల్స్ లోనే ఫుడ్ ని అందిస్తూ భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంటున్నారు. ఇకపోతే మామూలుగా ఒక బిర్యాని తినాలి అంటే ఎంత లేదన్నా 120 నుంచి 200 లేదా 300 దాకా కూడా ఉంటుంది. అటువంటి బిర్యానీ తక్కువ ధరకే లభిస్తోంది అంటే జనాలు అక్కడికి క్యూ కడతారని చెప్పవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రదేశంలో బిర్యాని కేవలం రూ. 59 రూపాయలు మాత్రమే. ఏంటి బిర్యానీ రూ. 59 అని ఆశ్చర్యపోతున్నారా, మీరు విన్నది నిజమే.
అయితే ఆ బిర్యాని పాయింట్ ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాద్ లోనే ఉంది. కాకా 55 బిర్యానీ పాయింట్లో రూ. 59 చికెన్ బిర్యానీ లభిస్తోంది. దమ్ బిర్యానీ 59 రూపాయలు ఉండగా, ఇద్దరు తినాలనుకుంటే 120 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక ఫ్రై బిర్యానీ కూడా రూ. 70కే దొరుకుతోంది. వీరికి హైదరాబాద్లో 3 ఔట్లెట్స్ ఉన్నాయి. నాంపల్లి బీజేపీ కార్యాలయం, కూకట్పల్లి సెకండ్ ఫేజ్, మూడో ఫేజ్ దగ్గర ఉన్నాయి. ఒక్కో హోటల్ వద్ద రోజూ 250 ప్లేట్స్ వరకూ సేల్స్ చేస్తున్నారు.
ఆర్డర్లపై కూడా బిర్యానీ తయారు చేసి అందిస్తారు. ఏ పార్టీ ఉన్నా ఒక రోజు ముందు చెప్తే నోరూరించే బిర్యానీ ఆర్డర్ మనముందు ఉంచుతారు. ధర తక్కువ ఉన్నా.. రుచి సూపర్గా ఉంటుందని అక్కడ తిన్నవారు చెబుతున్నారు. రుచి చాలా అద్భుతంగా ఉందని, డబ్బులు కూడా చాలా తక్కువ అని బిర్యానీ తింటున్న వారు చెబుతున్నారు. అంతేకాకుండా స్విగ్గి జొమాటోలో లాంటి ద్వారా కూడా వీళ్ళు ఫుడ్ ని డెలివరీ చేస్తున్నారు. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో కస్టమర్లు వస్తున్నారని వారు చెబుతున్నారు.