Siddipet: కొన్ని గంటల్లో కూతురికి పెళ్లి.. కానీ చివరికి?

Siddipet: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా పెళ్లిళ్లలో విషాదాలు నెలకొంటున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ మధ్యకాలంలో వరుడు మృతి వధువు మృతి అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సంతోషంగా భాజ భాజంత్రీలు మోగాల్సిన పెళ్లి ఇండ్లలో చావు డప్పులు మొగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపురం గ్రామంలో అయిలయ్య అనే 45 ఏళ్ళ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఒక కూతురు, ఒక కుమారుడు సంతానం.

పుట్టిన పిల్లలను తండ్రి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నత చదువులు చదివించాడు. తన పిల్లలు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని కలలు కన్నాడు. ఇందుకోసం అతని కూతురు కూడా బాగానే చదువుకుంది. ఇక వరుసకు మేనల్లుడు ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనితో తన కూతురికి పెళ్లి చేయాలని అయిలయ్య అనుకున్నాడు. ఇందుకోసం అతని తల్లిదండ్రులతో మాట్లాడి తన కూతురితో పెళ్లికి ఈ నెల 21న నిశ్చితార్జం జరిపించారు. ఒక్కగానొక్క కూతురు కావడంతో అయిలయ్య పెళ్లి ఘనంగా జరిపించాలని అనుకున్నాడు.

 

పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. కానీ, సమయానికి డబ్బులు ఇస్తామన్న వ్యక్తులు చేతులు ఎత్తేయడంతో అయిలయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇందుకోసం ఎంతోమందిని అప్పు కావాలని అడిగాడు. కానీ, అయిలయ్య పరిస్థితిని చూసి అప్పు ఇవ్వడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. తెల్లారితే పెళ్లి, చేతిలో సరిపడా డబ్బు లేదు. ఆ సమయంలో అయిలయ్యకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక అయిలయ్య శుక్రవారం అర్థరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అది గమనించిన కొందరు బంధువులు వెంటనే కిందకు దించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు, భార్య, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. తెల్లారితే కూతురి పెళ్లి, అంతలోనే తండ్రి మరణించడంతో స్థానికులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -