Sadha: వెళ్ళవయ్యా.. వెళ్ళు. అన్న ఒక డైలాగ్ తో ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపింది సదా. 20 ఏళ్ల క్రితం జయం సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు లేనప్పటికీ డాన్స్ షోలకి గెస్ట్లుగా చేస్తూ ఇంకా ఇండస్ట్రీలో యాక్టివ్గానే ఉంది. 40 సంవత్సరాలు దాటిన ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోకపోవడం విశేషం.
అలాగే నిహారిక విడాకుల విషయం కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా అదే టాపిక్. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేశారు అంటారా.. అక్కడికే వస్తున్నా ఈమధ్య సదా చేసిన ఒక కామెంట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. నిహారిక ని టార్గెట్ చేసింది అంటూ సదా మీదా విరుచుకుపడుతున్నారు మెగా అభిమానులు.ఇంతకీ ఆమె ఏమన్నదో చూద్దాం.
సదా ని ఈమధ్య ఎవరో వయసు పైబడుతుంది కదా పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అడిగారంట. పెళ్లి చేసుకుంటే నాకు ఫ్రీడం పోతుంది ఇప్పుడు ఉన్నంత ఫ్రీగా పెళ్లి చేసుకుంటే ఉండలేను. నాకు తగినంత ఫ్రీడమ్ ఇచ్చి నన్ను బాగా చూసుకునేవాడు వస్తే అప్పుడు చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటే నాకు నచ్చిన పని నేను చేసుకోలేను అర్థం చేసుకొని మనకి ఫ్రీడం ఇచ్చే వ్యక్తి మన లైఫ్ లోకి వస్తే ఆ లైఫ్ బాగుంటుంది అలాంటి వ్యక్తి కోసమే చూస్తున్నాను.
అయినా గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయిన జంటల్ని ఈమధ్య మనం చూస్తూనే ఉన్నాం కదా.. దానికన్నా సింగిల్ గా ఉండటమే బెటర్ అని చెప్పింది సదా. పాపం ఆమె ఎవరిని ఉద్దేశించి చెప్పిందో కానీ నెటిజెన్స్ మాత్రం సమంత గురించి నిహారిక గురించి మాట్లాడుతుంది.నిహారికనే టార్గెట్ చేసింది అంటూ తెగ ఇదైపోతున్నారు మెగా అభిమానులు