Nag-Dhanush: నాగ్, ధనుష్ కాంబో మూవీకి ఆ టైటిల్ ఫిక్స్ చేశారా?

Nag-Dhanush: టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి మనందరికీ తెలిసిందే. ఆయన దర్శకత్వం వహించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఇకపోతే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా తర్వాత ధనుష్,నాగార్జున లాంటి స్టార్ హీరోలతో ఒక మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ధారావి అనే టైటిల్ పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ధారావి అనేది ముంబైలోని ప్ర‌ధాన‌మైన మురికివాడ‌. దాని వెనుక ఒక చ‌రిత్రే ఉంది.

 

ర‌జ‌నీకాంత్ కాలా సినిమా ఈ ధారావి చుట్టూనే తిరుగుతుంది. ఈసారి ధారావితో మాఫియాకు ఉన్న లింకుల‌తో శేఖ‌ర్ క‌మ్ముల ఈ సినిమా తీయ‌బోతున్నాడ‌ని టాక్‌. అయితే శేఖ‌ర్ క‌మ్ములది పూర్తిగా క్లాస్ మేకింగ్. అయితే ఈ సినిమా కోసం తొలిసారి యాక్ష‌న్ బాట ప‌డుతున్నాడు. ముంబై మాఫియాని త‌న‌దైన స్టైల్‌లో చూపించ‌బోతున్నారు శేఖర్ కమ్ముల. హీరో నాగార్జున ఈ సినిమాలో ముంబై డాన్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్‌. ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

శేఖ‌ర్ క‌మ్ముల‌తో దేవిశ్రీ ప్ర‌సాద్ ప‌నిచేయ‌డం ఇదే తొలిసారి. ఇటీవ‌లే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ధనుష్ నాగార్జున కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం అటు ధనుష్ అభిమానులు ఇటు అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇద్దరి హీరోల కాంబినేషన్లు రాబోతున్న సినిమా ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి. కాగా హీరో అక్కినేని నాగార్జున తాజాగా నా సామిరంగ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: ఏపీకి మరో దత్త పుత్రుడు వచ్చాడు.. వైరల్ అవుతున్న వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మనం దత్త పుత్రుడు అనే పదాన్ని ఎక్కువగా విని ఉంటాము. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి దత్తపుత్రుడు ప్యాకేజి...
- Advertisement -
- Advertisement -