Mega Heroes: మెగా ట్యాగ్ వల్లే ఈ హీరోలు క్లిక్ అయ్యారని మీకు తెలుసా?

Mega Heroes: మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి, ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో రాణించారు. తన ప్రతిభను చూపించుకొని మెగస్టార్‌గా బిరుదు పొందారు. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలుగా వచ్చారు. వారందరూ ఏదో రకంగా మెగాస్టార్‌ పేరు ఉపయోగించిన వారే. ప్రస్తుతం ఇండస్ట్రీలో సగానికి సగం మందికి పైగా మెగా ఫ్యామిలీ హీరోలే. మిగతా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో వారసత్వం పేరుతో హీరోలను దింపారు. అయితే మెగా ఫ్యామిలీ దింపిన అంత మంది హీరోలను ఏ ఫ్యామిలీలో రాలేదు. అయితే మెగాస్టార్ పేరు చెప్పుకొని ఆయన భిక్షతో ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన చాలామంది మెగా హీరోలు ప్లాప్ అయ్యారు.

 

అయితే ఇప్పుడు ఈ టాపిక్‌ మీదనే సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. కొందరు సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ సొంత హీరోలను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. మెగా ట్యాగ్ వేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ మిగతా హీరోలతో కంపేర్ చేస్తే బెటర్ అనే చెప్పాలి. కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోని సుప్రీం హీరోగా చేసి ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు.

అల్లు శిరీష్‌ను మాత్రం మెగా ఫాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ‌అసలు హీరోగా నువ్వు వేస్ట్ అంటూ సొంత ఫ్యాన్స్‌ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ మధ్యనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ కూడా అంతే. ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. కనీసం డైలాగ్స్ చెప్పడం కూడా రాదంటున్నారు. ఇక కళ్యాణ్ దేవ్ గురించి అయితే చెప్పనవసరంలేదు.

 

నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా మెగా ట్యాగ్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాడే. ఆయన పర్లేదనిపించుకున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ కూడా డల్ అయ్యాడు. రీసెంట్ కాలంలో ఆయన నటించిన సినిమా రిలీజ్ అయింది లేదు. కానీ రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి మార్కులు వేయించుకుంటారు. అయితే మెగా ఇండస్ట్రీలో మొత్తంగా మెగా ట్యాగ్ ఉపయోగించుకుని వచ్చిన హీరోలల్లో సక్సెస్ అయిన వారు రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ క్రమంలోనే ఒకవేళ వీళ్ళు మెగాట్యాగ్ ఉపయోగించుకోకపోయి ఉంటే కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు కూడా పనికిరారు అంటూ యాంటీ మెగా ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -