Mega Heroes: ఈ నటుల కెరీర్ నాశనం కావడానికి మెగా హీరోలే కారణమా?

Mega Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అంచలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి తర్వాత కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి దాదాపు 7, 8 మంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఈ విధంగా చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన హీరోలు కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వారికంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.అయితే ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ పై పలువురు సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈ విధంగా మెగా కుటుంబాన్ని తిడుతూ వివాదాలలో ఉండడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీకి కూడా దూరమైన వారు ఉన్నారు.

ఈ విధంగా మెగా కుటుంబాన్ని తిట్టి ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయినటువంటి వారిలో శ్రీరెడ్డి ఒకరు.ఈమె గతంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వీరి తల్లి అంజనాదేవి గురించి కూడా ఈమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో ఈమెను మెగా కుటుంబమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ కూడా బ్యాన్ చేయడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాగే మరొక నటుడు పోసాని కూడా మెగా కుటుంబాన్ని తిట్టుతూ అవకాశాలు కోల్పోతున్నారు.

ఈయనకు అవకాశం దొరికిన ప్రతిసారి మెగా కుటుంబంలోని హీరోల గురించి మాట్లాడతారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఈయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇలా మెగా కుటుంబం గురించి ఈయన ఆరోపణలు చేయడంతో మెగా ఫ్యామిలీ పోసానిని బ్యాన్ చేశారు.మెగా ఫ్యామిలీ మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలు కూడా వారి సినిమాలలో ఈయనకు అవకాశాలు ఇవ్వడం లేదు.ఇతనితో పాటు మరొక రచయిత కూడా మెగా కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో దూషించడంతో ఆయన కూడా ఇండస్ట్రీకి దూరమై పోయారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు మెగా కుటుంబాన్ని తిడుతూ ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -