AS Ravikumar Choudhary: 22 మంది హీరోలు మార్నింగ్ పేపర్ వచ్చే వరకు మందు తాగుతానే ఉంటారు.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్!

AS Ravikumar Choudhary:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లకు కొదువే లేదు అని చెప్పవచ్చు. ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ వారిలో ఉన్న టాలెంట్ ని బయటపెడుతూ ఎన్నో మంచి మంచి సినిమాలను తెరికెక్కించిన విషయం తెలిసిందే. కొందరు స్టార్ డైరెక్టర్లుగా రాణిస్తుండగా మరి కొందరు అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులకు మంచి సినిమాలను అందిస్తున్నారు. ఇక ఒకటి రెండు సినిమాలకు దర్శకత్వం వహించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన డైరెక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు మంచి గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.

అటువంటి వారిలో దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కూడా ఒకరు. ఈయన టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా స్వామి సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈయన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మున్నారా చోప్రాను ముద్దు పెట్టుకోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దర్శకుడి పై ఒక రేంజ్ లో విమర్శలు గుప్పించడంతోపాటు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నెటిజన్స్. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను వైరల్ చేస్తూ భారీగా ట్రోల్స్ చేశారు. ఇక ఆ కామెంట్స్ పై ఆయన స్పందించిన విషయం తెలిసిందే. తనపై నెగిటివ్ గా కామెంట్స్ చేసే వారికి దిమ్మతిరిగే రేంజ్ లో సమాధానం ఇచ్చారు.

అ సంగతి పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో సదరు యాంకర్ మీకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ మందు తాగడం అనగా మందు తాగడం అని ఎవరు చెప్పారండి. మందు తాగి 22 మంది హీరోలను పేర్లు నేను బయట పెడతాను వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పమన్నా చెప్తాను అనగా, అవన్నీ వద్దండీ మీరు మాకు శ్రేయోభిలాషి కాబట్టి మీ హెల్త్ పరంగా నేను అలా అడుగుతున్నాను అనగా అలా అయితే ఓకే. మందు తాగడం తప్పు కాదు అలా అని ఎవరు చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు 22 మంది హీరోలు తెల్లవారి న్యూస్ పేపర్ వచ్చే వరకు తాగుతూనే ఉంటారు. వారి పేర్లు చెప్పమంటారా అంటూ సంచలన వాఖ్యలు చేశారు రవి కుమార్ చౌదరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -