Actress: న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కిన హీరోయిన్స్ వీళ్ళే!

Actress: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రేటీలు ఎంతో అందంగా, హ్యాపీగా కనపడుతూ ఉంటారు. వాళ్లు సినిమాల్లో నటన పరంగా ఎంత ఆనందంగా కనబడతారో రియల్ లైఫ్ లో కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు. కానీ వారి మనసులో ఎంతో తీరని దుఃఖం ఉంటుంది.అందులో వైవాహిక జీవితం, ప్రేమ జీవితం, ఆస్తి గొడవలు ముందు వరుసలో ఉంటాయి.

ఇక ఆస్తి గొడవలు తమ తల్లిదండ్రుల దగ్గర, బంధువుల దగ్గర నుంచి ఎదుర్కొంటూ ఉంటారు. అలా సెలబ్రేటీలకు సంబంధించి తమ తల్లిదండ్రులతో ఆస్తి వ్యవహారాల్లో గొడవలు అయితే వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇక ఇటువంటి కోవకు చెంది కోర్టు మెట్లు ఎక్కిన హీరోయిన్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కాంచనమాల: నటి కాంచనమాల గురించి మనందరికీ తెలిసిందే. ఎయిర్ హోస్టెస్ నుంచి హీరోయిన్ గా వెండి తెరపై అడుగు పెట్టింది..తన అందంతో గ్లామర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేది. దాదాపు తాను నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కాగా ఆమె సంపాదనను తల్లిదండ్రులు అనుభవించి తనకు పెళ్లి చేయకుండా నిర్లక్ష్యం చేశారని కోర్టు మెట్లు ఎక్కింది ఈ బ్యూటీ. బ్రహ్మచారిగా గడుపుతున్న కాంచన కోర్టు ద్వారా తన ఆస్తి దక్కించుకుంది.

కుష్బూ: నటి కుష్బూ మనందరికీ తెలిసిందే. తన చిన్నతనం నుంచే నటిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కుష్బూ ఆస్తి విషయంలో తనకు న్యాయం జరగాలని తల్లిదండ్రులపై కేసు వేసింది. ఇక అప్పట్లో తనకు తండ్రి అనే వాడు లేడు అని కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేసింది.

అమీషా పటేల్: ఇక అప్పటి అందాల భామ అమీషా పటేల్ గురించి మనందరికీ తెలిసిందే. బద్రి సినిమాలో హీరోయిన్ గా పరిచయమైన అమీషా.. తన తల్లిదండ్రులపై కేసు పెట్టింది. తల్లిదండ్రులు తన డబ్బును తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారని స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇక ఆమె తండ్రి అమిత్ పటేల్ పై 12 కోట్ల రూపాయల కోసం దావా వేసింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -