Kushboo: వైరల్ అవుతున్న కుష్బూ సంచలన వ్యాఖ్యలు!

Kushboo: ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్న ఖుష్బూ కేవలం తెలుగు బాషలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది. కాగా తమిళంలో ఈమెకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి మనందరికి తెలిసిందే. తమిళ అభిమానులు ఈమెకు తమిళనాడులో ఏకంగా గుడి కూడా కట్టించారు అంటే ఆమెకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

అంతే కాకుండా తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్ ఖుష్బూ రికార్డును కూడా సాధించింది. ఇకపోతే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఖుష్బూ ప్రస్తుతం బుల్లితెరపై పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే వెండితెర పై కూడా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన తాజా చిత్రం రామబాణం. గోపీచంద్, డింపుల్ హయతి కలిసి నటించిన ఈ సినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ పలు విషయాలను వెల్లడించింది.

 

ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ.. ఆయన ఒక లెజెండ్‌. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మానవత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వం, చేసే పని మీద ప్యాషన్‌ అద్భుతంగా ఉంటాయి. ఆయన ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. కొత్తది చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను మెగాస్టార్‌ ఏది చేసినా చూస్తారు అని అనుకోరు. ఇప్పటివరకు పూర్తికాని, నా కల ఏదైనా ఉంది అంటే అది మెగాస్టార్ గారితో రొమాన్స్‌ చేయలేకపోవటమే. స్టాలిన్‌ సినిమాలో ఆయనతో కలిసి నటించాను. తర్వాత ఇద్దరం కలిసి ఒక కమర్షియల్‌ యాడ్‌ చేశాము. దానికి మంచి స్పందన వచ్చింది. ఆయనతో కలిసి పని చేయటానికి ఒక మంచి స్క్రిప్టు కోసం చూస్తున్నాను. మెచ్యూర్‌ లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామా లాంటివి చిరంజీవి గారితో చేయాలని ఉంది. అదే నా కల అని చెప్పుకొచ్చింది కుష్బూ.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -