Ravinder Chandrasekar: కారును బహుమతిగా ఇస్తూ రవీందర్ ఏమన్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Ravinder Chandrasekar: సోషల్ మీడియాలో ఓ కోలీవుడ్ సెలబ్రిటీ జంట తెగ వైరల్ అయింది. సీరియల్ నటి మహాలక్ష్మి ఇటీవల నిర్మాతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్‌కు గురయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ ఇది రెండో వివాహమే అయినా.. ఎంతో సంతోషంగా ఉంటున్నారు. తాజాగా దీపావళి వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఆసక్తికర పోస్టును పెట్టారు. రవీందర్ తన భార్య మహాలక్ష్మికి రూ.20 లక్షలకు పైగా ధరుండే కారును బహుమతికి ఇచ్చాడు. దీంతో మహాలక్ష్మి తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు మరోసారి వైరల్ అయ్యాయి. అలాగే దీపావళి పండుగ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ సందర్భంగా ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది మహాలక్ష్మి. ‘మనం ఎల్లప్పుడూ ఇలానే సంతోషంగా కలిసి ఉండాలి. ప్రతి దీపావళి పండుగను నీతోనే జరుపుకోవాలి. లవ్ యు మై మెన్.’ అని రాసుకొచ్చింది. ఈ పోస్టుకు నిర్మాత రవీందర్ కూడా రియాక్ట్ అయ్యాడు.

 

https://www.instagram.com/p/CkQrMeKDyLo/

రవీందర్ తన పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చాడు. ‘ఇష్టమైన వారితో ఉంటే ప్రతి రోజు దీపావళి పండుగే. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. జీవితంలో మనం ప్రేమించే వ్యక్తిని కనుక్కోవడం ఎంతో కష్టమైన పని. మనం ప్రేమించే వ్యక్తి.. మనల్నీ కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి దొరకడం అదృష్టం. కొత్త భార్యతో కొత్త కారు. మంచి కారును పొందగలిగాం. ఈజీ డ్రైవింగ్‌తో క్రేజీగా ముందుకు సాగుదాం.’ అని చెప్పుకొచ్చారు.

 

కాగా ఈ సెలబ్రిటీ జంట బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీకి చెందిన ఎంజీ కారును కొనుగోలు చేశారు. అయితే రవీందర్, మహాలక్ష్మి ఇప్పటికే ఆడి కారును కలిగి ఉన్నారు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలను నటి మహాలక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతలో మరో కొత్త కారును కొనుగోలు చేసి.. మరోసారి ఫోటోలను తమ అభిమానులకు పంచుకున్నారు. కాగా, మహాలక్ష్మి రవీందర్ కంటే ముందు అనిల్ నేరేడిమిలితో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. 2019లో విడాకులు తీసుకున్న ఈ భామ.. 2022 సెప్టెంబర్‌లో నిర్మాత రవీందర్‌ను పెళ్లి చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -