Lakshmi: లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే మీ చేతిలో డబ్బులు నిలుస్తాయట.. ఏం చేయాలంటే?

Lakshmi: సాధారణంగా ప్రతి ఒక్కరూ లక్ష్మిదేవి అనుగ్రహం కలగాలని ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తూ పాటిస్తూ ఉంటారు. ఒకసారి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంతటి బీదవారైనా కూడా ధనవంతులు అవ్వాల్సిందే. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో 8 మంది ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎంత కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో డబ్బులు మిగలడం లేదని అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి చేతిలో డబ్బులు నిలవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మహావిష్ణువుకి లక్ష్మీ తోడుగానే ఉందని, లక్ష్మీనారాయణలు వేరు వేరు కాదని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెప్పడం జరిగింది. అయితే మహాశక్తి సృష్టిని పాలించడానికి, విష్ణువుకి తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని, దేవీ భాగవతంలో ఉంది. లక్ష్మీ, విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడు అయ్యాడని, అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగుమహర్షి తపస్సు చేయగా, లక్ష్మీ భృగువు ఖ్యాతిల కూతురుగా లక్ష్మీ పుట్టిందని అంటారు. భృగువు విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అందుకని లక్ష్మిని భార్గవి అని అంటారు. వేదాలలో కూడా లక్ష్మీదేవి గురించి చెప్పడం జరిగింది. యజుర్వేదంలో,మత్స్య పురాణంలో, అగ్ని పురాణంలో కూడా అమ్మవారు గురించి ఉంది. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాం కోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

 

పూజ గదిలో నేతితో దీపారాధన చేసి, అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెట్టి, తొమ్మిది శుక్రవారములు ఇలా లక్ష్మీదేవిని ఆరాధిస్తే, చాలా మంచి జరుగుతుంది. మహాలక్ష్మి దేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం మహాలక్ష్మి దేవికి ఉసిరికాయ దీపాలని వెలిగిస్తే, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనకధార స్తోత్రం పఠించిన తర్వాత, ఉసిరికాయ బొబ్బట్లు లేదా గుజ్జును మహాలక్ష్మి దేవికి నైవేద్యం పెడితే, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉసిరి దీపంతో మహాలక్ష్మి దేవికి హారతి ఇస్తే, దరిద్రం పోతుంది. ఉసిరికాయ దీపాన్ని మహాలక్ష్మి దేవికి పెట్టడం వలన అప్పుల బాధ నుండి బయటపడొచ్చు. ఉసిరి గుజ్జు, ఉసిరికాయ పచ్చడి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి, తర్వాత ముత్తైదువులకి వాయనం ఇస్తే, మొండి బకాయిలు వసూలు అవుతాయి. శ్రీ చక్రానికి ఉసిరికాయని నైవేద్యంగా పెడితే, సిరిసంపదలు కలుగుతాయి. ఉసిరి చెట్టుకి ప్రతిరోజు పూజ చేసి నీళ్లు పోసి నమస్కరించుకుంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -