CM YS Jagan: ఎక్కడికెళ్లినా అంతే.. బాబును చూసి జగన్‌కు అసలు అంత వణుకు ఎందుకు?

CM YS Jagan: ఏపీ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ప్రతిపక్ష టీడీపీతో నేతలను ప్రతి అంశంలో ఇబ్బంది పెట్టందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఇబ్బంందులకు గరి చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. జగన్ లో భయం మొదలైందని, టీడీపీ నేతలు అడ్డుకునే ప్రతి కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఏ కార్యక్రానికి పిలుపుునిచ్చినా పోలీసులు ముందస్త ుఅరెస్ట్ లు చే్తున్నారని, టీడీపీకి జగన్ భయపడుతున్నారని చెప్పడానికి ఇంతకంటే కారణం మరొకటి లేదని అంటున్నారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపైనే జగన్ ఫోకస్ మొత్తం ఉంది. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా పర్యటనను అడ్డుకుకనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న విషయం తెలిసిందే. చంద్రబాబును తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే చంద్రబాబును అడ్డుకున్నారు. చంద్రబాబుపై దాడికి వైసీపీ కార్యకర్తలు యత్నించారు. కుప్పం మెయిన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరి దాడి చేసుకోవడం చంద్రబాబు పర్యటనలో అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి.

అయితే తాజాగా చంద్రబాబు చిత్తూరు పర్యటనను కూడా వైసీపీ సర్కార్ టార్గెట్ చేసింది. చిత్తూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. బుధవారం కుప్పంలో కూడా పర్యటించ ేఅవకాశముంది. అయితే చంద్రబాబు తిరుపతి పర్యటన క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. హైవేపై పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. తిరుపతి వైపు వెళ్తున్న వాహనాలను పరిశీలిస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు వెళ్తే కేసులు తప్పవని పోలీసులు టీడీపీ నేతలను హెచ్చరిస్తన్నారు. టీడీపీ నేతలు చిత్తూరు వెళ్లకుండా ఎక్కడిక్కడ నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కుప్పంలో ఇటీవల చంద్రబాబుకుపై దాడికి వైసీీప నేతలు ప్రయత్నించారు. దీంతో ఇప్పుడు మళ్లీ చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లే అవకాశమున్న నేపథ్యంలో చాలామంది టీడీపీ నేతలు చిత్తూరుకి చేరుకుంటున్నారు. అందుకే చంద్రబాబు పర్యటనల్లో ఇబ్బందులు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై టీడీప నతేలు మండిపడుతున్నారు. చంద్రబాబు అంటే వైసీపీకి ఎందుకంత ఉలుకుపాటు అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబును చూసి జగన్ కు ఎందుకంత వణుకు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటనకు వస్తే జగన్ ఎందుు భయపడుతున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -