Rajashekar Daughters: రాజశేఖర్ కూతుళ్ల మధ్య గొడవలకు అసలు కారణమిదా.. ఒకరిపై మరొకరికి ఈర్ష్య, అసూయ ఉందా?

Rajashekar Daughters: టాలీవుడ్ స్టార్ హీరో రాజశేఖర్ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు రాజశేఖర్. కాగా రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్,శివాత్మిక రాజశేఖర్ ల గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినీ బ్యాగ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఎవరికి వారు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. వారు నటించినది చిన్న సినిమాలే అయినప్పటికీ వాటితో మంచి మార్కులు సంపాదించి అవకాశాలు దక్కించుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఇద్దరు వరుసగా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో అందాల కనువిందు చేస్తున్నారు. ఒకరిని మించి ఒకరు అందాల ప్రదర్శన చేస్తూ యువతకు చెమటలు పట్టిస్తున్నారు. అక్కను మించి చెల్లి, చెల్లిని మించి అక్క అన్నట్లుగా పోటీపడుతూ అందాలు ఆరబోస్తున్నారు. మొత్తానికి వీరిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒకే స్థానంలో ఉన్నారు. ఒకరిని మించి మరొకరు టాలెంట్ చూపిస్తున్నారు. కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో బాగా హడావిడి చేస్తూ తమ ఫొటోస్ ను షేర్ చేసుకుంటున్నారు. వీరిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటూ ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ ని కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.

 

కాగా తాజాగా శివాత్మిక చేసిన పనికి వీరిద్దరికి మధ్యన వివాదాలు జరిగి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవల శివాని నటించిన జిలేబి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో పాటు సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. శివాత్మిక తన అక్క శివాని నటించిన జిలేబి సినిమాపై ఎటువంటి కామెంట్స్ చేయలేదు కానీ సోషల్ మీడియా వేదికగా హీరో సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ సినిమా గురించి తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది.
ప్రస్తుతం శివాత్మిక పెట్టిన ప్రేమ్ కుమార్ మూవీ పోస్టర్ తో పాటు ఆమె కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శివాని సినిమా రిలీజ్ అయినా ఎటువంటి విధంగా స్పందించని నువ్వు ఇతర హీరో సినిమాపై కామెంట్స్ చేశావు అంటే మీ ఇద్దరికీ మధ్యన గొడవలు జరిగాయా అంటూ, మీ అక్క ఎదగడం నువ్వు చూడలేకపోతున్నావా అంటూ శివాత్మిక చేసిన పనికి జనాలు మండిపడుతున్నారు. ఈ విషయంపై శివాత్మిక, శివాని రాజశేఖర్ లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి..

 

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -