Daggubati: ఎమ్మెల్యే, ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారారు.. దగ్గుబాటి కామెంట్స్ వైరల్!

Daggubati: తాజాగా బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రులో ప్రవాసాంధ్రులు నిర్మించిన రుద్రభూమి ప్రారంభోత్సవంలో మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడితో కలిసి దగ్గుబాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో అవికాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ దక్కనివారు తన దృష్టిలో అదృష్టవంతులు. అలాంటి వాళ్లకు రూ.40 కోట్లు మిగిలినట్లే. ఓడిపోయినవారు లెక్కింపు కేంద్రంలో ఏడుస్తారని విజేత ఇంటికెళ్లి ఏడుస్తారని అన్నారు.

 

ప్రస్తుత పరిస్థితులు ఇలాగే ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తనలాంటి వారు ఇమడలేరని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తాను, తన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌ పోటీ చేసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు. ప్రస్తుత రోజుల్లో గౌరవప్రదంగా రాజకీయాలు చేసే పరిస్థితి లేదని, ఐదేళ్లు ప్రజలకు సేవ చేసినా ఎన్నికల్లో రూ.40, 50 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. గతంలో కొందరు ప్రజా ప్రతినిధులు గెలిచాక కొంత సంపాదించుకొని తిరిగి ఎన్నికల్లో ఖర్చు పెట్టేవారని ప్రస్తుత పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి పార్టీ అధిపతులే ఇసుక, మద్యం, గనులలో అక్రమంగా సంపాదించడం ఇప్పుడు రాజకీయాలలో కొత్త ట్రెండ్‌ అని అన్నారు.

 

పార్టీ అధినేత వద్ద అవినీతి కేంద్రీకృతమవుతోందని, అలాగే దేశవ్యాప్తంగా ఏక నాయకత్వంలో ఉన్న పార్టీలన్నింటి పరిస్థితి ఇలాగే ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో కోట్లకు కోట్లు ఖర్చు చేయడం మళ్ళీ సంపాదించడం కోసమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వెంకటేశ్వరరావు. గతంలో ఎమ్మెల్యేలు కొంత సంపాదించుకున్నా, ప్రస్తుతం మాత్రం పార్టీ అధినేతలే సంపాదించుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారారని తాను ఎవరినో దూషించటానికో, కక్షతో చెప్పే మాటలు కాదన్నారు. ప్రస్తుత పరిస్థితి అలా ఉందని అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నట్లు దగ్గుబాటి తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -