Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీ అధినేతలు భారీ బహిరంగ సభలు రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ముగ్గురు కూడా ఒకే జిల్లాలో పర్యటన చేయబడుతున్నారు. ఇలా ఈ ముగ్గురు నేతలు ఓకే జిల్లాలో ప్రచార కార్యక్రమాలను రోడ్డు షోలను నిర్వహిస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఆ జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ఇలా ముగ్గురు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నటువంటి తరుణంలో అక్కడ రాజకీయ వేడి రాజుకుంది.

మరి కాసేపట్లో జనసేన పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ రోడ్ షో, ర్యాలీ నిర్వహించనున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు మండలాల మీదుగా భారీ ర్యాలీ చేపడుతున్నారు. పవన్ ర్యాలీ కోసం అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అలాగే మధ్యాహ్నం పిసిసి అధ్యక్షురాలు షర్మిల రోడ్డు షో నిర్వహించనున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎన్నికల సభను సీఎం జగన్ నిర్వహించనున్నారు. ఇలా ప్రజలందరూ కూడా భారీ స్థాయిలో రోడ్డు షోలకు బహిరంగ సభలకు తరలివస్తున్నారు. ఇక ఎన్నికలలో భారీ పోటీ నెలకొంది అని చెప్పాలి కూటమి వైసిపి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉన్నటువంటి తరుణంలో ఎవరు గెలుపొందుతారన్న ఆత్రుత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -