Heroine: రాజా రాణి మూవీపై ప్రముఖ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?

Heroine: డైరెక్టర్ అట్లీ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. దర్శకుడిగా ఈయన వరుస సినిమాలను తెరకెక్కిస్తూ ఎంతో సక్సెస్ అందుకుంటున్నారు. అయితే ఈయన రాజారాణి సినిమా ద్వారా హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. నయనతార, నజ్రియా, జై, ఆర్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది.

 

తాజాగా ఈ సినిమా గురించి నటి సాక్షి అగర్వాల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ సినిమా డైరెక్టర్ అట్లీ ఈ సినిమాలో నాకు అవకాశం ఇస్తానని చెప్పి నమ్మకద్రోహం చేశారు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను బెంగళూరులో ఉన్నాను. చిత్ర బృందం నా కాస్టింగ్ టీం ని సంప్రదించి తనకు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా అవకాశం ఇస్తానని చెప్పారు. దాంతో సరేనని నేను కూడా ఈ సినిమాకు కమిట్ అయ్యాను.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత నేను కూడా ఒక మూడు రోజులపాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాను అనంతరం నాకు చిత్ర బృందం నుంచి ఫోన్ కాల్స్ రాలేదు. కొద్ది రోజులకి ఈ సినిమా విడుదల కావడంతో నేను షాక్ అయ్యాను అయితే ఇందులో నా పాత్ర ఒక కాఫీ షాప్ లో కాఫీ ఆర్డర్ ఇచ్చే పాత్రలో మాత్రమే నన్ను పెట్టారని సెకండ్ హీరోయిన్ అని చెప్పి డైరెక్టర్ మోసం చేశారు అంటూ ఈమె తెలిపారు.

 

ఈ విషయం గురించి నేను అప్పుడే డైరెక్టర్ అట్లీతో మాట్లాడాల్సి ఉండేది నేను ఆయనతో మాట్లాడకుండా ఉండటమే చేసిన తప్పు అంటూ సాక్షి అగర్వాల్ ఈ సందర్భంగా రాజారాణి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Nara Lokesh: గులకరాయి ఘటనలో జగన్ కు భాస్కర్ అవార్డ్.. నారా లోకేశ్ పంచ్ లు వేరే లెవెల్!

Nara Lokesh:  ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజులలో జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీలో ఎన్నికల హీట్ మరింత పెరుగుతుంది. ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే...
- Advertisement -
- Advertisement -