Pranitha: ప్రణీత కూతురు ఫోటోలో ఈ లక్షణాలను గమనించారా?

Pranitha: అమ్మ పోలిక, కూతురు చాలా అందంగా ఉండటంతో పాటు ముఖంలో కళ ఉంది
కన్నడ కస్తూరి ప్రణీత సుభాష్ గురించి అందరికీ తెలిసిందే. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ సినిమాతో ఆడియెన్స్‌లో సుస్థిర స్థానం సంపాందించారు. ఈ మూవీలో క్యూట్‌గా నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.

 

‘అత్తారింటికి దారేది’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఆమెకు ఇతర ఇండస్ట్రీల్లోనూ నటించే అవకాశం దక్కింది. ఈ క్రమంలో కన్నడ, హిందీ సినిమాల్లోనూ ప్రణీత యాక్ట్ చేశారు. అయితే ఆ తర్వాత ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఈ సుందరి 2021లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత పెళ్లి చేసుకున్నారు.

కూతురి ఫొటోలు షేర్ చేసిన ప్రణీత
పెళ్లి తర్వాత తన జీవితం గురించి ప్రణీత సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇటీవల పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే ఇప్పటి వరకు తన కూతురి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ ఎక్కడా కనపడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా ప్రణీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూతురితో కలసి ఉన్న ఫొటోలు పంచుకున్నారు. తొలిసారి తన కూతురి ముఖాన్ని చూపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అచ్చం అమ్మ పోలికే!
‘వారాంతాల్లో పేరెంటింగ్ హ్యాక్. ఇక నుంచి నా వారాంతాల్లో ఇలాగే ఉంటుంది’ అని ఆ పోస్టులో ప్రణీత రాసుకొచ్చారు. దీనికి లవ్ ఎమోజీని జతచేశారు. దీంతో పాప ఫొటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వావ్.. ఎంత క్యూట్‌గా ఉందని, తల్లి పోలికే అని కామెంట్లు పెడుతున్నారు. ప్రణీత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అభిమానులకు దగ్గరవుతుండటం విశేషం.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -