Venkatesh-Trisha: వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమేనా?

Venkatesh-Trisha: 2007లో వెంకటేష్ కథానాయకుడిగా త్రిష కథానాయకగా వచ్చిన సినిమా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే. ఈ సినిమా అప్పట్లో రికార్డుల సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్లు వసూలు చేసింది. 200 కేంద్రాలలో 50 రోజులు ఆడింది. 21 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో పాటు ప్రేయసి కోసం వెంట తిరిగి మరీ ప్రేమించడం వంటివన్నీ చూస్తే మన నిజ జీవితానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి.

ఈ సినిమాని దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక్కడ సూపర్ హిట్ అయిన తర్వాత ఇదే సినిమాని తమిళంలో ధనుష్ తో తీశాడు సెల్వ రాఘవన్ అక్కడ కూడా బాగానే ఆడింది. కానీ తెలుగులో హిట్ అయినంతగా హిట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడవలసిన సందర్భం ఏమిటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా! రీసెంట్ గా సెల్వరాగవన్ ఒక ట్వీట్ చేశాడు.

అది ఏంటంటే ఆడవారి మాటలకు అర్ధాలే సినిమా చాలా రోజుల తర్వాత చూశాను. ఆ సినిమా చూస్తున్నంత సేపు దానికి సీక్వెల్ చేయాలని మనసవుతుంది అని. అయితే ఈ ట్వీట్ చూసిన త్రిష నేను రెడీ అంటూ రిప్లై ఇచ్చింది. అన్నీ ఓకే అయితే ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమా సీక్వెల్ మన ముందుకి రాబోతుంది. ఆ సినిమా ఎండింగ్ వెంకటేష్ ఇంట్లో త్రిష కుటుంబ సభ్యులందరూ చేరిపోయినట్లుగా చూపిస్తాడు.

ఒకవేళ సీక్వెల్ సినిమా తీస్తే కథని అక్కడి నుంచే ప్రారంభిస్తారేమో అంటూ అప్పుడే వెంకటేష్ ఫ్యాన్స్ కథలు కూడా అల్లేసుకుంటున్నారు. ఈ సినిమాకి ఇంకా కథా రాసుకోలేదు, హీరోని ఒప్పించలేదు అప్పుడే కథలు అల్లేసుకుంటున్న ప్రేక్షకులను చూస్తే ఆ సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -