Chiranjeevi: చిరంజీవికి అవార్డులు రావడానికి త్రిష కారణమా.. ఏం జరిగిందంటే?

Chiranjeevi: చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. గత సంవత్సరం దసరా రోజు విశ్వానికి మించి అనే పోస్టర్ తో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇన్ని రోజులు ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క, మృణాల్ ఠాగూర్ నటించబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే వాటికి చెక్ పెడుతూ స్టార్ హీరోయిన్ త్రిషను ఫైనల్ చేసింది చిత్ర బృందం.

 

తాజాగా ఈ బిగ్ ప్రాజెక్ట్ లోకి రీసెంట్ గా అడుగు పెట్టింది త్రిష. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్ల తర్వాత మెగాస్టార్ తో మళ్ళీ కలవటం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాకు ఎంతో గొప్ప గౌరవం, చిరు సార్ నాకు హృదయపూర్వక స్వాగతం పలికినందుకు చాలా ధన్యవాదాలు అని తెలిపింది. త్రిషకి చిరంజీవితో ఇది రెండవ సినిమా. 18 ఏళ్ల కిందట 2006వ సంవత్సరంలో స్టాలిన్ సినిమాలో వీళ్ళిద్దరూ జతకట్టారు. మళ్లీ ఇప్పుడు విశ్వంభర లో కలిసి నటించబోతున్నారు దీంతో మెగా అభిమానులు తెగ ఆనంద పడుతున్నారు.

సోషియో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఇది ముస్తాబు అవుతోంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం చిరంజీవి కెరియర్ లోనే అత్యధిక వ్యయంతో రూపొందించబడుతోంది. ఈ సినిమా కోసం 13 భారీ సెట్లతో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు.2025 జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

 

అయితే గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార అనే సినిమాని చేసిన దర్శకుడు ఆ సినిమాని హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కించాడు.వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సినిమాగా ఇండస్ట్రీలో నిలిచింది. ఇప్పుడు చిరంజీవితో ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తీయబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు చిరు అభిమానులు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -