Kalyani: కళ్యాణి భర్త సంచలన వ్యాఖ్యలు. భార్య అలా అంటూ?

Kalyani: చిత్ర పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ గ్లామర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. చాలామంది చాలా సింపుల్ గా ఇతరుల పట్ల ఆకర్షితులు అయిపోతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొందరు అవసరాల కోసం ఆకర్షితులు అయితే.. మరికొందరు కెరీర్ ఆరంభంలో ఈ మాయా ప్రపంచం గోలలో పడి ఆకర్షితులు అయ్యి అన్ని అర్పించేసుకుంటూ ఉంటారు. సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల ప్రేమలో ప‌డుతూ ఉంటారు.

 

సినీ రంగంలో పెళ్లిళ్లు విడాకులు ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ అన్నీ సినీ పరిశ్రమల్లో ఇదే తరహా వ్యవహారం నడుస్తోంది. హీరోలు, హీరోయిన్లు ఎలా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారో అలాగే దర్శకులు హీరోయిన్లు కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సందర్భంగా బోలేడు. ఈ లిస్టులోకే వస్తారు ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి. దర్శకుడు సూర్యకిరణ్. కళ్యాణి మలయాళీ అమ్మాయి. ఆమె మలయాళంలో బాలనాటిగా చిత్ర పరిశ్రమంలో ప్రవేశించి ఆ తర్వాత మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించింది.

పెద్దయ్యాక తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలోనే దర్శకుడు సూర్యకిరణ్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. తెలుగులో శేషు-అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్ళాంతో పనేంటి , ఆపరేషన్ దుర్యోధన, వసంతం, ధన 51 లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ధన 51 సినిమా దర్శకుడు సూర్యకిరణ్ ప్రేమలో పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకొని కొన్నేళ్లపాటు కాపురం చేశాక ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో వీరు విడిపోయారు.

 

ప్ర‌స్తుతం ఇద్ద‌రు వేర్వేరుగా ఉంటున్నా మ‌ళ్లీ ఎవ్వ‌రూ పెళ్లి చేసుకోలేదు. కేవ‌లం ఆర్థిక‌ప‌ర‌మైన కార‌ణాల‌తో స్ప‌ర్థ‌లు వ‌చ్చి విడిపోయామే త‌ప్పా క‌ళ్యాణి అంటే త‌న‌కు చాలా ఇష్టం అని.. ఆమెకోస‌మే తాను మ‌ళ్లీ పెళ్లి చేసుకోకుండా కూడా వెయిట్ చేస్తున్నాన‌నంటూ సూర్య‌కిరణ్ చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఇప్ప‌ట‌కీ ఇద్ద‌రికి ఒక‌రు అంటే ఒక‌రికి ఇష్ట‌మే.. కానీ క‌ళ్యాణి ఆర్థికంగా సూర్య కిర‌ణ్ ఇబ్బందుల్లో ప‌డ‌డంతోనే విడాకులు ఇచ్చేసింద‌ని కిర‌ణ్ చెప్పాడు. అయితే క‌ళ్యాణి చాలా మంచిద‌ని చెప్ప‌డం విశేషం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -