Shobha Shetty: డబ్బుల గురించి శోభాశెట్టి సంచలన వ్యాఖ్యలు.. అసలేమైందంటే?

Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ లో దీప ఎంత ఫేమస్ అయిందో అంతకన్నా ఎక్కువే మోనిత క్యారెక్టర్ ఫేమస్ అయింది. ఒక పర్ఫెక్ట్ విలన్ క్యారెక్టర్ లో మోనిత ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి అందరినీ అలరించింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఫేమ్ వస్తుంది కానీ అక్కడ ప్రవర్తించే తీరుబట్టి అభిమానం వస్తుంది .ఒకవేళ ఎక్కడైనా తేడా కొడితే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతారు.

 

ఇక్కడ శోభా శెట్టి విషయంలో కూడా అదే జరిగింది. అంతా నాకే కావాలి అన్న స్వార్థం, ఓటమిని చూడలేను అనే తత్వం వల్ల విపరీతమైన ట్రోలింగ్ కి గురైంది శోభ శెట్టి. కానీ తన టాలెంట్ తో, స్నేహితుల కోసం ఏమైనా చేసే గుణంతో చాలామంది మనసులను కూడా ఆకట్టుకుంది. అయితే శోభ తన ప్రియుడు యశ్వంత్ తో తాజాగా ఎంగేజ్మెంట్ జరుపుకుంది.

అంతే కాకుండా రామ మందిరం ప్రతిష్టాపన రోజు అయిన జనవరి 22న తన సొంతింటి తాళాలు తన చేతికి వచ్చాయి అని ప్రకటించింది. ఈ ఇల్లు తన చిరకాల కోరిక, రెండు సంవత్సరాల క్రితం ఒక ఇంటి కన్స్ట్రక్షన్ నచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చాము తర్వాత అనివార్య కారణాల వల్ల కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. మాకు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు అసలు ఇల్లు కడతానా లేదా అని అనుకున్నాను. బిగ్ బాస్ తో వచ్చిన డబ్బులతో నేను ఇల్లు తీసుకోలేదు అంతకుముందే ఇల్లు తీసుకున్నాము.

 

కాకపోతే తాళాలు చేతికి రావడానికి లేట్ అయ్యాయి. ఇంకో నాలుగు నెలలలో ఇంటీరియర్ డిజైనింగ్ కూడా అయిపోతుంది. తర్వాత ఈ ఇంటికి షిఫ్ట్ అయిపోతాము అని చెప్పింది శోభా శెట్టి. ఈ శుభ సందర్భాన్ని తన ప్రియుడి యశ్వంత్ తో, తల్లిదండ్రులతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -