Shobha Shetty: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రసారమవుతుంది ఆదివారం 14 మంది కంటెస్టెంట్లతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి వారం నామినేషన్ కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్రలో నటించిన శోభా శెట్టి అలియాస్ మోనిత ఇలాంటి గుర్తింపు సంపాదించకుండా మనకు తెలిసిందే.
ఇలా ఈ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి ఈమె ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలోకి వెళ్లినటువంటి శోభా శెట్టి శోభా శెట్టి మాదిరి కాకుండా కార్తీకదీపం సీరియల్ లోని మోనిత తరహాలో గేమ్ ఆడటం మొదలుపెట్టింది. హౌస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంటెస్టెంట్ తో కయ్యానికి కాలు దువ్వుతూ అందరితో గొడవ పెట్టుకుంటున్నారు.
తాజాగా నామినేషన్ లో భాగంగా ఈమె కిరణ్ రాథోడ్ అలాగే గౌతమ్ కృష్ణను సిల్లీ రీజన్స్ తో నామినేషన్ చేశారు. కిరణ్ రాథోడ్ కు తెలుగు రాదని చెప్పి నామినేట్ చేశారు. ఇక గౌతమ్ కృష్ణ అనే కంటెస్టెంట్ తనతో సరిగా మాట్లాడటం లేదని ఒక రీజన్ చెప్పి ఆమె నామినేట్ చేశారు అయితే శోభ శెట్టి ని మాత్రం సింగర్ దామిని నామినేట్ చేయడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు .
ఇలా బిగ్ బాస్ హౌస్ లో మోనిత ఒక కంటెస్టెంట్ గా కాకుండా విలన్ గా ప్రవర్తిస్తున్నారు అంటూ నేటిజన్స్ భావిస్తున్నారు. ఈమెను సీరియల్ లో మోనిత పాత్రలో చూసి సీరియల్ లో భాగంగా అలా నటిస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఈమె నిజస్వరూపం ఇదేనని ఈమె ఆట చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె పద్దతి మార్చుకోకుంటే త్వరలోనే హౌస్ నుంచి బయటకు వస్తారని కామెంట్ చేస్తున్నారు.