Karthika Deepam: కార్తీకదీపంలో షాకింగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే?

Karthika Deepam: ఎపిసోడ్ ప్రారంభంలో.. డాక్టర్ బాబు, వంటలక్కలు కలిసి ఇంద్రుడు, శౌర్యల కోసం వెతుకుతూ ఉంటారు. ఓ ఆటో స్టాండ్ వద్ద అందరినీ అడుగుతూ కనిపిస్తారు. మరోపక్క శౌర్య కోసం ఇంద్రుడు వెతుకుతూ ఉంటాడు. రోడ్డు మీద నడుచుకుంటే వస్తున్న కార్తీక్, దీపాలకు కారులో నుండి శౌర్య గొంతు వినిపిస్తుంది. దాంతో ఇద్దరు పరుగెత్తుకుంటూ వెళ్లినా.. పట్టుకోలేకపోతారు. మరోవైపు కారును ఫాలో చేసిన ఇంద్రుడు శౌర్యను తీసుకెళ్ళిపోతాడు.

ఇంద్రుడితో.. ‘నేను రాను తాతయ్య, అమ్మనాన్న కనిపించే వరకు నేను ఇంటికి రాను’ అని చెప్పి శౌర్య వెళ్లిపోతుంది. ఆ మాటలకు ఆనంద్ రావు, హిమలు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక ఆటోలో ఊరి వదిలి వెళ్ళిపోదాం శౌర్య అని ఇంద్రుడు చెప్తాడు. సంగారెడ్డిలో అమ్మానాన్న ఉండొచ్చు.. అక్కడికి వెళ్లి వెతుకుదాం అని అంటాడు. అందుకు శౌర్య కూడా ఒప్పుకుంటుంది.

ఇంకో పక్క వంటలక్క ఇంటికి మోనిత వస్తుంది. ఇంటికి అప్పటికే తాళ్ వేసి ఉండగా.. అది చూసి… ‘ఈ టైంలో ఎక్కడికి వెళ్లారు’ అని అనుకుంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన దుర్గ.. ‘నీ బాధ భరించలేక లేచిపోయారు’ అని అంటాడు. ‘రేయ్ ఎం మాట్లాడుతున్నావ్.. భార్య భర్తలు ఎక్కడైనా లేచిపోతారా’ అని మోనిత అంటుంది. దానికి దుర్గ బదులిస్తూ.. ‘ఆ రికార్డు నీకే సొంతం బంగారం’ అంటాడు.

‘పరాయి ఆడదాని భర్తని నా భర్తే అని చెప్పుకునే ఆడవాళ్లు ఉన్నప్పుడు వాళ్ళు లేచిపోవడంలో తప్పేముంది బంగారం’ అంటూ దుర్గు వ్యంగ్యంగా మాట్లాడతాడు. డాక్టర్ బాబుకు గతం గుర్తుకొచ్చేసిందని షాకింగ్ న్యూస్ మోనితతో చెబుతాడు దుర్గ. ఆ మాటలకూ మోనిత షాక్ అయ్యి.. ‘ఆ ఛాన్సే లేదు.. డాక్టర్ బాబుకు గతం గుర్తొచ్చే అవకాశం లేదు’ అని మోనిత అంటుంది. దానికి దుర్గ బదులిస్తూ.. ‘నీ మీద ఒట్టు బంగారం డాక్టర్ బాబుకు గతం గుర్తొచ్చేసింది’ అంటాడు.

 

తర్వాతి సీన్ లో డాక్టర్ బాబు, వంటలక్క కారులో ఇంద్రుడు ఇంటికి వస్తారు. ఆ ఇంటికి తాళం ఉండడంతో భయపడిపోతారు. ఇల్లు వదిలి వెల్లిపోయారేమో అనుకుంటారు. కానీ వెళ్లలేదని ఇంటి పక్కన వారు చెప్తారు. ఇక అక్కడే పడేసిన అమ్మానాన్న ఎక్కడున్నారు అనే స్టిక్కర్ చూసి ఇంద్రుడు మన పాపను మనకు ఇవ్వకూడదు అనుకుంటున్నారు అందుకే తీసేసారు అని డాక్టర్ బాబు, వంటలక్క అనుకుంటారు. సరేలే ఇక్కడే ఎదురుచూద్దాం అని డాక్టర్ బాబు అంటే.. వెళ్ళిపోదాం అని వంటలక్క బ్రేక్ వేస్తుంది.

అదేంటి శౌర్య ఇక్కడుందని వద్దామని అనే నువ్వు వెళ్ళిపోదాం అంటున్నవ్ అని డాక్టర్ బాబు అడిగితే.. ‘నాకు ఎందుకు అనుమానంగా ఉంది డాక్టర్ బాబు.. అందుకే డాక్టర్ బాబు వెళ్ళిపోదాం అంటున్నాను.. వాళ్ళు చూసి మనదగ్గరకు రాకపోతే కష్టం .. రేపు ఉదయమే వచ్చేద్దాం’ అని చెప్పి డాక్టర్ బాబుని వంటలక్క తీసుకెళ్తుంది. మరోవైపు శౌర్య గురించి ఆలోచిస్తూ హిమ, ఆనంద్ రావులు కన్నీళ్లు పెట్టుకుంటారు. అసలు అమ్మానాన్నలు ఉన్నారా తాతయ్య అని బాధపడుతుంది.

ఇంకో సీన్ లో మోనిత టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. ‘కార్తీక్ కు గతం గుర్తొచ్చిందా? నిజంగానే వంటలక్క, డాక్టర్ బాబు లేచిపోయారా నిజామా’ అంటూ టెన్షన్ పడుతుంటుంది. ‘అయినా గతం గుర్తొస్తే నన్ను తొక్కి వెళ్ళిపోతాడు కానీ అలా దొంగచాటుగా లేచిపోరు కదా’ అని మోనిత ఆలోచిస్తుంది. సరే ఫోన్ చేద్దామని చేస్తే ఫోన్ పని చేయకపోవడంతో.. ‘నేను ఇన్నాళ్లు కష్టపడింది వీళ్ళు ఇలా లేచిపోవడానికా.. ఇప్పుడు నేనేం చెయ్యాలి’ అని మోనిత తల పట్టుకుంటుంది. దీంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -