Marriage: మేనరికం పెళ్లి చేసుకున్న వాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇన్ని సమస్యలు వస్తాయా?

Marriage: చాలామంది పెళ్లిళ్ల విషయంలో ముక్కు ముఖం తెలియని వారి కంటే తెలిసిన వారు చుట్టూ ఉన్నవారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనకు పల్లెటూర్లలో అయితే ఎక్కువగా మేనరికం పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. మేనరికం పెళ్ళిళ్ళు పాత కాలం నుండి వస్తున్న సాంప్రదాయం అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎక్కువ మంది పెళ్ళిళ్ళ విషయంలో ముందు తమ బంధువులలో ఎవరైనా ఉన్నారా అని చూస్తారు. ఆ క్రమంలో మేన మరదలు కానీ, మేనకోడలు ఉంటే వారితో పెళ్లి జరిపిస్తారు.

అయితే ఈ వివాహ విషయంలో ఆనందంగా కొంతమంది ఉండగా, కొందరు మాత్రం మేనరికం పెళ్ళిళ్ళ అంటే భయంతో వీటికి దూరంగా ఉంటున్నారు. మరి వాళ్ళందరూ మేనరికపు పెళ్ళిళ్ళకి ఎందుకు భయపడుతున్నారు? మేనరికకు పెళ్లిళ్లు చేసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇలా మేనరకపు పెళ్లిళ్ళు చేసుకున్న వారికి పుట్టబోయే బిడ్డకు రకరకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిలో ప్రధానంగా అంగవైకల్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా వినికిడి లోపం కూడా కనిపిస్తోంది. అయితే వీటికి ప్రధాన కారణం ఏంటి అంటే సాధారణంగా పుట్టబోయే బిడ్డకు తల్లి నుండి 23 క్రోమోజోములు తండ్రి నుండి 23 క్రోమోజోములు వస్తాయి.

 

ఇలా వచ్చే క్రోమోజోములు తల్లిదండ్రుల నుండి బిడ్డకు ముఖ్య సమాచారాన్ని చేరుస్తాయని సైన్స్ చెబుతోంది. పెళ్లి చేసుకున్న జంట రక్త సంబంధీకులు కానప్పుడు వారి బిడ్డకు సమాచారాన్ని చేర్చే ఒక జన్యువు తండ్రిలో లోపించినపుడు, తల్లి నుండి వచ్చే జన్యువుతో ఆ లోపం ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇదేవిధంగా తల్లిలో లోపించినపుడు, తండ్రి నుంచి వచ్చే జన్యువు వల్ల పుట్టబోయే బిడ్డ ఏ లోపం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా భార్యాభర్తలు రక్త సంబంధీకులు అయినపుడు ఇద్దరు జన్యువులలోను లోపం ఉన్నప్పుడు దాన్ని సరి చేసే అవకాశం ఏది ఉండకపోవడంతో, ఆ పిల్లలకి జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -