Devotional: పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపించడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

Devotional: సాధారణంగా పెళ్లి అంటే ఎన్నో రకాల సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎన్నో రకాల విషయాలను ఇప్పటికీ పెళ్లిలో పాటిస్తూనే ఉన్నారు. అందులో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం కూడా ఒకటి. అయితే పెళ్లిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు అన్నది చాలా మందికి తెలియదు. పెళ్లిసమయంలో పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తెకు ఆకాశంలో నక్షత్ర రూపంలో ఉన్న అరుంధతిని చూపిస్తారు. అయితే ఎందరో మహా పతివ్రతలుండగా అరుంధతినే ఎందుకు చూపిస్తారు. నూతన దంపతలకు అరంధతిని చూపించడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రహ్మ కుమార్తె పేరు సంధ్యాదేవి. తనకు ఉపదేశము చేయగల బ్రహ్మచారి కోసం ముల్లోకాలు వెదకడం ప్రారంభించింది సంధ్యాదేవి. అయితే వశిష్ఠుడే తనకు ఉపదేశం చేసేందుకు తగినవాడని భావించి విని ఆయన్న ఆశ్రయించింది. బ్రహ్మచారి అయిన వశిష్ఠుడు ఆమెకు ఉపదేశం చేయడానికి అంగీకరించాడు. ఉపదేశ అనంతరం సంధ్యాదేవి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంది. ఆ అగ్ని నుంచి ప్రాతః సంధ్య, సాయం సంధ్యలతో పాటు ఒక స్త్రీ రూపం వెలువడ్డాయి. అందమైన ఆ స్త్రీ రూపమే మహా పతివ్రత అరుంధతి. వశిష్ఠుడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని తగిన వధువు కొరకు అన్వేషణ ప్రారంభించాడు. తనను పెళ్లిచేసుకునే స్త్రీకి ఒక పరీక్ష పెట్టాడు వశిష్టుడు. అదేంటంటే ఇసుకతో అన్నం వండటం.

 

అందుకే ఒక ఇసుక మూటను పట్టుకుని దాన్ని అన్నంగా వండగలిగినవారు ఎవరంటూ సంచారం చేశారు. ఆ సందర్భంలో అరుంధతి వశిష్టుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించింది. తనకున్న దైవబలంతో ఇసుకను బియ్యంగా మార్చి వండి వడ్డించింది అరుంధతి. సంతోషించిన వశిష్ఠుడు ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే తన చేతి కమండలం అరంధతి కిచ్చి తాను తిరిగివచ్చేవరకూ దాన్ని చూస్తూ ఉండమని చెప్పి వెళ్లాడు. అలా ఏళ్ల తరబడి అరుంధతి ఆ కమండలాన్నే చూస్తూ ఉండిపోయింది. అయినా వశిష్ఠుడు ఇంకా తిరిగి రాలేదు. ఎందరో పండితులు,రుషులు ఆమెను చూపు మరల్చమని చెప్పినా చూపు తిప్పలేదు.. చివరకు బ్రహ్మాదిదేవతలు దిగివచ్చి ఆమెను కమండలము నుంచి చూపు మరల్చాలని చెప్పినా వినలేదు. ఇక చేసేది లేక విశిష్టుడిని వెతికితీసుకొచ్చి ఆమె ముందు నిలిపారు. ఆయన రాకతో తన చూపును కమండలం నుంచి విశిష్టుడి వైపు మరల్చింది. అప్పుడు బ్రహ్మాది దేవతల సమక్షంలో అరుంధతిని పెళ్లిచేసుకున్నాడు విశిష్టుడు. అప్పటి నుంచి మనసా, వాచా, కర్మణా వశిష్టుడిని అనుసరించి మహాపతివ్రతగా నిలిచిపోయింది అరుంధతి. అందుకు నవవధువు కూడా అరుంధతిలా ఉండాలని, అరుంధతిలా సహనం, శాంతం, ఓర్పు, పాతివ్రత్య లక్షణాలు కలగి ఉండాలని ఆ బంధం అరంధతి, వశిష్టులులా చిరస్థాయిగా వెలగాలని, నిలవాలని దాని అర్థం.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -