Rashmika-Vijay Devarakonda: రష్మికకు విజయ్ దేవరకొండ అన్యాయం.. ఆమె వల్లేనా?

Rashmika-Vijay Devarakonda: సినిమా ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలు కలిసి నటిస్తే చాలు వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని రూమర్లు పుడుతూనే ఉంటాయి. ఇది రూమరో నిజమో తెలియదు కానీ ఈ మధ్య ఈ జంట టాలీవుడ్ లో కనిపించట్లేదు. అది ఎవరంటే టాలీవుడ్ లో రొమాంటిక్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మరియు విజయ్ దేవరకొండ జంట. గీతా గోవిందం సినిమాలో వీరిద్దరూ జంటగా నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఈ సినిమాలో నటించిన తీరు చూస్తే నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారేమో అన్నట్టుగా అనిపించింది.

ఇక తర్వాత డియర్ కామ్రేడ్ చిత్రంతో వీరిద్దరూ మరింత దగ్గరయ్యారు. ఒకానొక సమయంలో వీరిద్దరూ ఇక ప్రేమలో మునిగిపోయారని అనుకున్నారంతా. ఆ తరువాత వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. నిజంగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇక ఇది నిజమే అన్నట్టుగా ఏ ఈవెంట్లో చూసిన వీరిద్దరూ జంటగా రావడం కూడా జరిగింది.

అయితే ఈ జంట అసలు ఏ ఈవెంట్లోనూ, ప్రమోషన్లోనూ ఎక్కడా కూడా కనిపించట్లేదు. మాములుగా అయితే వీరిద్దరి సినిమా ప్రమోషన్లకు ఒకరికొకరు ఆహ్వానించుకునేవారు కూడా. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట మధ్య దూరం బాగా పెరిగింది. అకస్మాత్తుగా ఇలా జరగడానికి కారణమేమిటో అభిమానులకి అంతు చిక్కడం లేదు.

అయితే కొందరు మాత్రం టాలీవుడ్ లో మరో టాప్ హీరోయిన్ తో విజయ్ సన్నహితంగా మెలగడమే వీరి జంట దూరమవ్వడానికి కారణం అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఆ టాప్ హీరోయిన్ తో విజయ్ సినిమా కూడా విడుదలకి సిద్ధమవుతోంది. ఇప్పటికే విజయ్ తనతో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. సినిమాల మాటా అటుంచితే వీరిద్దరూ సన్నిహితంగా మెలగడం రష్మికకు అసలు నచ్చట్లేదని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే రష్మిక విజయ్ జంట ఈ మధ్య కనిపించట్లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -