Uttar Pradesh: పోస్టుమార్టం చేస్తుండగా శరీరం నుంచి అలాంటి శబ్దం?

Uttar Pradesh: అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఊహించని సంఘటనలు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని రకాల సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేయగా మరికొన్ని ఆనందించే విధంగా ఉంటాయి. మామూలుగా మనిషి చనిపోయిన తర్వాత పోస్టుమార్టం చేస్తూ ఉంటారు. అయితే చనిపోయారు అని నిర్దారించుకున్న తర్వాతనే పోస్టుమార్టం చేస్తూ ఉంటారు. ఒకవేళ పోస్టుమార్టం చేసే సమయంలో చేయడానికి ముందు మనిషి శరీరంలో కదలికలు వస్తే.. ఊహించడానికి కాస్త భయంగా సంతోషంగా ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా చోటు చేసుకుంది.

 

పోస్టుమార్టం చేయాలి అనుకుంటున్న ఒక అమ్మాయి శరీరంలో నుంచి గుండె చప్పుడు వినిపించడంతో అందరూ ఆశ్చర్యపోయి వెంటనే ఆమెకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌ లోని మిర్జాపూర్‌లో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. కుటుంబసభ్యులు అంతా అయిపోయిందుకున్న సమయంలో మ్యాజిక్ జరిగింది. ఇంట్లోని శోకసంద్రం కాస్త ఆనందంగా మారింది. ప్రస్తుతం ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. రాహ్‌ కలాం హవూదవా గ్రామంలోని చెరువులో రవీనా అనే యువతి దేహం తేలుతూ కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. ఆ యువతి మృతిచెందిందని భావించిన పోలీసులు పోస్టుమార్టంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తల్లిదండ్రులు ఆమెను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలని కోరారు. దీంతో పోలీసులు పటెహరా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు యువతిని పరిశీలించి, గుండె కొట్టుకుంటున్న విషయాన్ని గమనించారు. వెంటనే చికిత్స చేయడం ప్రారంభించడంతో యువతి కోలుకుంది. తమ కూతురు బతికేవుందని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తమ కూతురు మానసిక స్థితి సరిగ్గా లేదని ఇంట్లో చెప్పకుండానే వెళ్లిపోయిందని తెలిపారు. ఏదిఏమైనప్పటికీ కూతురు బతకడమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు అమ్మాయి తల్లిదండ్రులు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -