Uttar Pradesh: 10 లక్షలు ఇస్తే భార్యతో అది చేస్తా.. భర్త షాకింగ్ షరతులు ఇవే!

Uttar Pradesh: ప్రస్తుత సమాజంలో ప్రతి పదిమంది అబ్బాయిలకు కేవలం ఆరుగురు అమ్మాయిలు మాత్రమే దొరుకుతున్నారు. మిగిలిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అమ్మాయిలు దొరకని అబ్బాయిలు అల్లాడిపోతుండగా ఇంకొందరు అబ్బాయిలు మాత్రం దొరికిన అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుని వేధించడం లాంటివి చేస్తున్నారు. చివరికి వారి ప్రాణాలను తీయడానికి సైతం వెనకాడడం లేదు. పెళ్లి వరకు బాగానే ఉన్నామా చాలా మంది పురుషులు పెళ్లి అయిన తర్వాత వారిలో ఉన్న మరొక రూపాన్ని బయటకు తీస్తున్నారు. ఒక నవ వరుడు ఒక శాడిస్టులా ప్రవర్తించాడు.

అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ లోని బడాయూకు చెందిన ఒక యువకుడికి ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఫిలిబిత్ కు చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో దాదాపుగా 15 లక్షలతో భారీ మొత్తంలో నగదు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. కానీ వరుడికి మాత్రం ఇంకా ఆశపోలేదు. పెళ్లి చేసుకున్నప్పటికీ వధువుతో శోభనం జరగకుండా దూరంగా పెడుతూ వచ్చాడు. ఎందుకు భర్త దూరం పెడుతున్నాడో వధువుకు అర్థం కావడం లేదు. పది రోజులపాటు చూసిన ఆ యువతి ఆ తర్వాత మార్చి 29న ఆ విషయాన్ని తన అత్తకు చెప్పింది. అత్తయ్య కూడా సరిగా స్పందించకపోవడంతో పుట్టింటికి వెళ్ళి జరిగినదంతా తల్లికి వివరించింది.

 

దాంతో ఆ యువత తల్లిదండ్రులు కుమార్తెను తీసుకువచ్చి అదే అంశం గురించి వియ్యపు వాళ్ళ ఇంట్లో మాట్లాడారు. అప్పుడు వరుడు అసలు నిజ స్వరూపం బయటపడింది. అదనపు కట్నం కింద పది లక్షలు ఇస్తేనే తన భార్యను హనీమూన్ కి తీసుకెళ్తానని శోభనం కూడా అప్పుడే అని వరుడు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పటికే చాలా వరకు ఇచ్చామని ఇలా అడగడం కరెక్ట్ కాదని వధువు కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా వరుడు వినిపించకూడదు. చేసేదేమీ లేక కూతురు భవిష్యత్తు కోసం ఐదు లక్షలు అప్పు తీసుకువచ్చి అల్లుడు చేతిలో పెట్టారు. ఇక ఇటీవలే మే ఏడవ తేదిన భార్యాభర్తలు ఇద్దరు హనీమూన్ కోసం నైనిటా వెళ్లారు. తన భర్తతో ఎంతో సంతోషంగా గడిపేందుకు వెళ్లిన భార్యపై అతడు శాడిజం చూపించాడు. ఒక రూమ్ లో తనపై అసహ్యంగా ప్రవర్తించి ఆమెను వివస్త్రను చేసి అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు తీసి భార్యను బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు రావాల్సిన ఇంకా ఐదు లక్షలు తీసుకురాకపోతే ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమెను బెదిరించాడు. భర్త చేష్టలకు విసిగిపోయిన బాధితురాలు వెంటనే పుట్టింటికి తిరిగి చేరుకుంది. తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అత్త ఆమె భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -