Uttar Pradesh: స్నేహ క్యారెక్టర్ అలాంటిది.. తనకు బ్రతికే హక్కు లేదంటూ?

Uttar Pradesh: ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది తమ ప్రేమించిన వారు మోసం చేయడంతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరి కొంతమంది హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఎటువంటి సంఘటన ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లో సంచలనంగా మారింది. ప్రియురాలు చేతిలో మోసపోయిన ఒక యువకుడు ఆమెను అందరి ముందు దారుణంగా కాల్చి చంపి ఆ తరువాత అతను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

ఈ ఘటన జరగడానికి ముందు తాను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ.. ఓ వీడియోని తన జీమెయిల్‌ అకౌంట్‌లో సేవ్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాలలోకి వెళితే…గ్రేటర్‌ నోయిడా పరిధిలోని శివ్‌ నాడార్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతోన్న స్నేహ చౌరాసియా అనే యువతి అదే సెక్షన్‌కు చెందిన అనుజ్‌ సింగ్‌ ని ప్రేమించింది.

 

కుటుంబంలో జరిగిన సంఘటన వల్ల అమ్మాయిలకు దూరంగా ఉన్న అనుజ్ సింగ్ కి స్నేహ పరిచయం వల్ల అతనిలో మార్పులు వచ్చాయి. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడ్డాడు. స్నేహ చౌరాసియా కూడా అతని ప్రేమను అంగీకరించింది. ఇలా ఏడాదిన్నర పాటు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత మానసిక ఒత్తిడి ఉన్నందువల్ల తనకి దూరంగా ఉండాలని ప్రియురాలు కోరడంతో ఆమె కోసం అనుజ్ అమెకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత కాలేజీలో పనిచేసే మరొక వ్యక్తితో స్నేహ కి సంబంధం ఉందని తెలుసుకున్న అనూజ్ అందుకు సంబంధించిన ఆధారాలు అన్నీ కూడా సంపాదించాడు.

 

ఆ తర్వాత ఒకరోజు క్యాంటీన్లో ఉన్న స్నేహ వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే స్నేహని తుపాకితో కాల్చి ఆ తర్వాత తాను కూడా హాస్టల్ లోకి వెళ్ళి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటన జరగడానికి ముందు అనూజ్ షేర్ చేసిన వీడియోలో.. స్నేహా లాంటి అమ్మాయి బ్రతికి ఉంటే ఎంతో మంది జీవితాలు నాశనమవుతాయి. అందువల్లే ఆమెను హత్య చేశానని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఆమె తల్లిదండ్రులకు కూడా క్షమాపణలు తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -