Suhasini: ఆ హీరో ఒడిలో కూర్చుని అలా చేయమన్నారు.. సుహాసిని కామెంట్స్ వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Suhasini: ఒకప్పటి కాలంలో అందరి అగ్ర హీరోలతో నటించిన కథానాయక సుహాసిని గురించి అందరికీ తెలిసిందే. అటు తమిళ్ లో కమల్ హాసన్ నుంచి ఇటు తెలుగు లో చిరంజీవి వరకు ప్రతి ఇండస్ట్రీలో అందరితో నటించింది సుహాసిని. మణిరత్నంతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సుహాసిని చాలాకాలం వరకు హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈమె సినిమాలలో సహాయ నటి పాత్రలో నటిస్తున్నారు.

అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం కూడా గ్లామర్ తగ్గకుండా అదే అందాన్ని మెయింటైన్ చేస్తున్న సుహాసిని వరుసగా సినిమాలలో అందరినీ అలరిస్తున్నారు. అలాగే ఒక సినిమా ఈవెంట్లో సుహాసిని తన సెట్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు. “ఒక సినిమా కోసం సెట్ లో ఆ హీరో ఒళ్లో కూర్చోమని నాకు చెప్పారు. కానీ నాకు అది నచ్చలేదు.

ఒక భారత స్త్రీ అయ్యుండి పరాయి మగాడి ఒడిలో కూర్చోవడం తప్పు అని చెప్పాను. దాని తర్వాత కూడా ఆ హీరో తినే ఐస్ క్రీమ్ ని నన్ను తినమన్నారు. నాకు అది అసలు నచ్చలేదు ఇంకొకరి ఎంగిలి నేను ఎలా తింటాను నాకు వేరే ఐస్ క్రీమ్ తెండి లేకపోతే ఈ సీన్ ని మార్చండి అని చెప్పాను దానికి ఆ కొరియోగ్రాఫర్ షాక్ అయ్యి తాను చెప్పినట్టే చేయమన్నారు నేను అసలు వినలేదు.

దాన్ని తర్వాత నటి శోభనకి కూడా ఇలాగే జరిగిందట. హీరో ఎంగిలి చేసిన ఐస్ క్రీమ్ ని తినమన్నారట. అప్పుడు తను చేయను అని చెప్పడంతో నువ్వేమైనా సుహాసినివి అనుకుంటున్నావా చేయకపోవడానికి అని డైరెక్టర్ అన్నారట. తను నాకు ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పింది. నేను నచ్చని షాట్ చేయను అని అందరికీ తెలిసిందనమాట అని అనుకున్నాను. అని ఈ సంఘటనని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు సుహాసిని.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -