Akividu: నడిరోడ్డుపై భార్యను దారుణంగా చంపిన భర్త.. ఆ భార్య చేసిన అతిపెద్ద తప్పు ఇదేనా?

Akividu: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు మానభంగాలు హత్యలు పెరుగుతూనే ఉన్నాయి. రోజు పదుల సంఖ్యలో ఆడవారిపై ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు కామాంధుల పట్ల సరైన కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో వారు మరింత రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా కూడా ఒక దుర్మార్గుడు నడి రోడ్డుపైనే భార్యను అత్యంత కిరాతకంగా చంపి హత్య చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇంతకీ ఆ భార్య చేసిన తప్పు ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..

ఈ సంఘటన ఆకువీడులో చూడు చేసుకుంది. శివాలయం వీధిలో ఉన్న సంధ్యారాణి, రాంబాబు ప్రేమించుకున్నారు. కులాలు వేరైనప్పటికీ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల పాటు అంతా బాగానే సాగింది. మెల్లమెల్లగా చెడు అలవాట్లకు బానిసయ్యాడు రాంబాబు. ప్రారంభం నుంచి మందలిస్తూ వస్తోంది సంధ్యారాణి. ఈ క్రమంలో దొంగగా కూడా మారాడు. చైన్ స్నాచింగ్ చేస్తూ పోలీసులకు దొరికాడు. దీంతో సంధ్యారాణి, ఇక భర్తను భరించలేకపోయింది. బిడ్డను తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. విడాకులకు కూడా దరఖాస్తు చేసింది. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో పంచాయితీ కూడా నడిచింది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్నాడు రాంబాబు. ఉద్యోగం కోసం విజయవాడ వెళ్లింది సంధ్యారాణి.

 

ఆమె తిరిగి ఆకివీడు వచ్చిందని తెలుసుకున్న రాంబాబు కాపు కాశాడు. ఈరోజు ఉదయం తన బైక్ పై గుడికి బయల్దేరింది సంధ్యారాణి. సరైన టైమ్ చూసిన రాంబాబు కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఒక్కసారిగా కిందపడిన సంధ్యారాణిపై చాకుతో విచక్షణరహితంగా దాడిచేశాడు. దాడి చేసిన అనంతరం వెంటనే సంధ్యారాణి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు రాంబాబు. సంధ్యాను చంపేసిన విషయాన్ని వాళ్లకు చెప్పి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లి సమయానికి కూతురు సంధ్య కొనఊపిరితో ఉంది. కూతురును ఆ స్థితిలో చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. నిమిషాల్లోనే తల్లి చేతుల్లో ప్రాణాలు వదిలింది సంధ్యారాణి.
ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు, రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన పాపానికి, భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది సంధ్యారాణి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -