Vizag: బేబీ సినిమాను మించిన ట్విస్టులతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఎంతమంది బలయ్యారంటే?

Vizag: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం బేబీ. ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా యూత్ కి బాగా నచ్చింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. యూత్ నుంచి ఈ సినిమాకు విశేషప్రేక్షకాధరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఉన్నట్టుగానే బయట కూడా చాలా మంది ప్రేమికులు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్న విషయం తెలిసిందే.

తాజాగా అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం కొత్తపాలెంలోని నాగేంద్ర కాలనీకి చెందిన యువతి, అదే ప్రాంతంలో ఉంటున్న సాయి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సాయి అటికా గోల్డ్ లో పనిచేసేవాడు. ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయారు. దీంతో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్న ఆ తర్వాత అసలు కథ మొదలైంది. సాయిని పెళ్లి చేసుకున్న యువతి, సూర్య ప్రకాష్ కు దగ్గరైంది. యువతికి పెళ్లయిందనే విషయం తెలియని సూర్య ప్రకాష్ కూడా ఆమెను ప్రేమించాడు.

 

ఇలా ఒకవైపు సాయితో కాపురం చేస్తూనే, మరోవైపు సూర్యప్రకాష్ తో డేటింగ్ చేసింది సదరు యువతి. అయితే ఇలాంటివి ఎక్కువ రోజులు సీక్రెట్ గా సాగవు కదా. సూర్యతో తన భార్య క్లోజ్ గా ఉంటున్న విషయం సాయికి తెలిసింది. అదే సమయంలో లో తన గర్ల్ ఫ్రెండ్ కు ఆల్రెడీ పెళ్లయిందనే విషయం సూర్యకు తెలిసింది. తనతో ఉండిపోవాలని సూర్య ప్రకాష్, సాయి ఇద్దరూ బలవంతం చేశారు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోయిన యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్ కేసుకు భయపడిన సూర్యప్రకాష్, గోపాలపట్నంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

మిగిలిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోతూ సూసైడ్ లెటర్ రాసింది యువతి. ఆ ఉత్తరం భర్తను ఉద్దేశించి రాసిందని పోలీసులు భావించారు. కానీ ప్రియుడిని ఉద్దేశించి ఉత్తరం రాసి ఆమె చనిపోయింది. సదరు యువతి, సాయి రహస్యంగా పెళ్లి చేసుకున్న వీడియో అదే యువతి, సూర్య ప్రకాష్ తో బీచ్ లో తీసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -